Tuesday, April 23, 2019

ధ్యానం ప్రారంభించడానికి చిట్కాలు (Tips to Get Started with Meditation)



ప్రశాంతముగా ఇరవై నిమిషాలు ధ్యానం చేయుటకు సిద్ధం అవ్వండి

మీకు తెలుసా మనం కొంచం సమయాన్ని ధ్యానం కోసం  కేటాయిస్తే మనకు ఎంత మంచి అనుభూతి కలుగుతుందో ?

మీ సౌకర్యం కోసం ఈ కింద చిట్కాలు ఇవ్వడం జరిగింది. ఇవి మీకు ధ్యానం చెయ్యడం లో సహాయ పడతాయి. మీరు ఈ చిట్కాలు చదివిన తరువాత, ధ్యానం  చెయ్యడానికి ఈ క్రిందవున్న 'గైడెడ్ మెడిటేషన్' ని క్లిక్ చెయ్యండి

1 మీకు అనుకూలమైన సమయాన్ని చూసుకోండి


ధ్యానం  అనేది పూర్తిగా విశ్రాంతి సమయం. కాబట్టి దీనిని మీకు పూర్తిగా అనుకూలమైన సమయంలో చెయ్యాలి. కాబట్టి మీకు   ఆటంకము కలగని సమయాన్ని, ప్రాంతాన్ని చూసుకోండి. మాములుగా సూర్యోదయం మరియు సూర్యాస్తమయం       సమయాలు ధ్యానం  చెయ్యడానికి అనుకూలంగా వుంటాయి.



2 ఒక నిశబ్ధమైన ప్రదేశాన్ని చూసుకోండి


 మీకు అనుకూలమైన సమయాన్ని చూసుకొన్న మాదిరిగానే మీకు ఆటంకము కలగని ప్రదేశాన్ని చూసుకోండి. ఒక నిశ్శబ్దమైన  మరియు ప్రశాంతమైన పరిసరాలు మనకు ధ్యానం  యొక్క గొప్ప  అనుభూతి కలగడానికి దోహదపడాయి.



3 మీకు అనుకూలమైన భంగిమ లో కూర్చోండి


మీ భంగిమ కూడా మీ ధ్యానం  మీద ప్రభావం చూపుతుంది. మీరు ప్రశాంతంగా, సౌకర్యవంతంగా, స్థిరంగా ఉండేలా చూసుకోండి. మీ వెన్నెముక నిటారుగా ఉండేలా  నేరుగా కూర్చోండి. మీరు ధ్యానం  చేసినంతసేపు  కళ్ళు మూసుకొని  భుజములు మరియు మెడ ప్రశాంతంగా ఉంచుకోండి. పద్మాసనం లో కూర్చొని ధ్యానం  చెయ్యమని మన పురాణాలు చెబుతున్నాయి.

4 మీ పొట్టను ఖాళీగా ఉంచుకోండి




 మీరు భోజనం చెయ్యడానికి ముందు ధ్యానం  చెయ్యడం మంచిది.

ఒకవేళ మీరు భోజనం చేసిన తరువాత ధ్యానం  చేస్తే మీకు నిద్ర రావచ్చు. ఏది ఏమైనా కూడా మీరు ఆకలిగా వున్నపుడు ధ్యానం  చెయ్యడానికి ప్రయత్నించకండి.

ఎందుకంటే మీ ద్యాసంతా ఆకలి మీదకు వెళుతుంది. ఐతే మీరు  భోజనం చేసిన 2 గంటల తరువాత ధ్యానం  చెయ్యవచ్చు.



5 సులభమైన వ్యాయామం తో ప్రారంభించండి


సులభమైన వ్యాయామం లేదా సూర్య నమస్కారాలు చెయ్యడం వలన రక్త ప్రసరణ జరుగుతుంది. దీనివల్ల మీ శరీరం లో వున్నా జడత్వం పోయి శరీరం తేలికగా అనిపిస్తుంది.

ఇలా చెయ్యడం వలన మీరు ధ్యానం  లో చాలాసేపు కూర్చోగలరు.

 6 కొన్ని దీర్ఘమైన శ్వాసలు తీసుకోండి


 దీర్ఘమైన శ్వాసలు తీసుకోవడం వలన మీరు ధ్యానం  బాగా చెయ్యగలరు. అలాగే ధ్యానం  చెయ్యడానికి ముందు నాడి  శోదన ప్రాణాయామం చెయ్యడం కూడా మంచిది.

దీనివలన మీ శ్వాస క్రమభద్ధమై   మీకు ప్రశాంతత కలుగ చేస్తుంది.



7 మీ ముఖము పైన చిరునవ్వు వుంచండి



మీరు చిరునవ్వు తో ధ్యానం  చెయ్యడం వలన మీరు ప్రశాంతమైన అనుభవం పొందగలరు.

 నెమ్మదిగా కళ్ళు తెరవండి


  మీరు ధ్యానం  చెయ్యడం పూర్తి అయిన తరువాత కంగారు పడకుండా నెమ్మదిగా మీ పరిసరాలు గుర్తుకు తెచ్చుకుని నెమ్మదిగా కళ్ళు తెరవండి. 

23-04-2019 : Daily Current Affairs Quiz (English)


3


quiz2

https://docs.google.com/forms/d/e/1FAIpQLSf5iWp1C23CwK8QUx7ZtOpLFel4Td9T0_gdXhaoLuEgepacIQ/viewform?usp=sf_link

quiz

CIMFRలో ప్రాజెక్టు అసిస్టెంట్లు


ధన్‌బాద్‌ (ఝార్ఖండ్‌)లోని CSIR - సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైనింగ్‌ అండ్‌ ఫ్యూయల్‌ రిసెర్చ్‌ (CIMFR) తాత్కాలిక కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ పర్సనల్‌ ఖాళీల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

పోస్టు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ (లెవెల్‌ 1/ లెవెల్‌ 2)
ఖాళీలు: 49 స్టైపెండ్‌: లెవెల్‌ 1 పోస్టులకు నెలకు రూ.15,000; లెవెల్‌ 2 పోస్టులకు నెలకు రూ.25,000
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ, మాస్టర్‌ డిగ్రీ, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.
వయసు: లెవెల్‌ 1 పోస్టులకు 28 ఏళ్లు, లెవెల్‌ 2 పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
వాక్‌ఇన్‌ తేది: ఏప్రిల్‌ 30 నుంచి మే 3 వరకు.
వేదిక: CSIR -CIMFR, రాంచీ రిసెర్చ్‌ సెంటర్‌, నామ్‌కుమ్‌, రాంచీ.
వెబ్‌సైట్‌: http://cimfr.nic.in/

ఎయిర్‌ ఇండియాలో అకౌంట్స్‌ క్లర్కులు


ఎయిర్‌ ఇండియా లిమిటెడ్‌ ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్టు ప్రాతిపదికన అకౌంట్స్‌ విభాగంలో పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

పోస్టులు-ఖాళీలు: అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌-25, అకౌంట్స్‌ క్లర్క్‌-36
కాంట్రాక్టు కాలవ్యవధి: ఐదేళ్లు
అర్హత: సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ ఫైనాన్స్‌, బీకాం, రెండేళ్ల అనుభవం.
వయసు: 01.04.2019 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.
వాక్‌ఇన్‌ తేది: మే 3, 4, 10, 11
వేదిక: న్యూదిల్లీ, ముంబయి.
వెబ్‌సైట్‌: http://www.airindia.in/

పబ్లిక్‌ హెల్త్‌లో PG కోర్సు


పుదుచ్చేరిలోని ICMR - వెక్టార్‌ కంట్రోల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (VCRC) పబ్లిక్‌ హెల్త్‌లో PG కోర్సును అందిస్తోంది.

కోర్సు: పీజీ ఇన్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఎంటమాలజీ (ఎంఎస్సీ పీహెచ్‌ఈ)
కాలవ్యవధి: రెండేళ్లు సీట్ల సంఖ్య: 12
స్కాలర్‌షిప్‌: నెలకు రూ.6000
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ/ బీవీఎస్సీ/ ఎంబీబీఎస్‌/ బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.
ఎంపిక: కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
పరీక్ష తేది: జూన్‌ 16
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ చివరితేది: మే 10
వెబ్‌సైట్‌: http://vcrc.res.in/

న్యూక్లియర్‌ మెడిసిన్‌లో PG



లక్నోలోని డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ 2019 సంవత్సరానికిగానూ PG కోర్సు ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు: M.Sc న్యూక్లియర్‌ మెడిసిన్‌ (రెండేళ్లు)
సీట్ల సంఖ్య: 06
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో B.Sc ఉత్తీర్ణత.
వయసు: 01.07.2019 నాటికి 17-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: మే 15
వెబ్‌సైట్‌: http://www.drrmlims.com/

జడ్జిమెంట్‌ ట్రాన్స్‌లేటర్లు


అలహాబాద్‌ హైకోర్టు కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: జడ్జిమెంట్‌ ట్రాన్స్‌లేటర్‌
ఖాళీలు: 05
అర్హత: మూడేళ్ల  బ్యాచిలర్‌ లా డిగ్రీ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ లా కోర్సు ఉత్తీర్ణత.
వయసు: 01.07.2019 నాటికి 21-35  సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: డిస్క్రిప్టివ్‌ ట్రాన్స్‌లేషన్‌ టెస్ట్‌, హిందీ టైపింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్‌ 25
వెబ్‌సైట్‌: http://ahcjt.cbtexam.in/

ధ్యానం


ధీ + యానం = ధ్యానం
ధీ = సూక్ష్మశరీరాది సముదాయం
అంటే, "ఆస్ట్రల్ బాడీ కాంప్లెక్స్" అన్నమాట
యానం = ప్రయాణం

"ధ్యానం" అంటే "సూక్ష్మశరీరాది సముదాయంతో చేసే ప్రయాణం"
దీనినే "ఆస్ట్రల్ ట్రావెల్" అంటాం.

ధ్యానం ద్వారానే సర్వలోకాలూ తిరగగలుగుతాం
ధ్యానం ద్వారానే సర్వలోకవాసులనూ కలుసుకోగలుగుతాం
ధ్యానం ద్వారానే సర్వలోక రహస్యాలనూ తెలుసుకోగలుగుతాం
ధ్యానం ద్వారానే సర్వలోక ఆనందాలూ పొందగలుగుతాం.

ఆనాపానసతి


ఆనాపానసతి ... అన్నది గౌతమబుద్ధుడు సుమారు 2500 సం|| క్రితం ఉపయోగించిన పాళీ భాష పదం. పాళీ భాషలో... "ఆనాపానసతి" అంటే "మన శ్వాసతో మనం కూడుకుని వుండడం" ... మరి దీనినే మనం "శ్వాస మీద ధ్యాస" అని చెప్పుకుంటున్నాం. ఆనాపానసతి అన్నదే ప్రపంచానికి … సకల ఋషులు, సకల యోగులు .. అందరూ కలిసికట్టుగా ఇచ్చిన  అద్భుతమైన వరం.

'ఆన' అంటే 'ఉచ్ఛ్వాస'
'అపాన' అంటే 'నిశ్వాస'
'సతి' అంటే 'కూడుకుని వుండడం'

సహజంగానే ప్రతి ఒక్కళ్ళూ  "సత్యాన్ని కనుక్కోవాలి" అన్నప్పుడు చివరిగా  చేరే స్థితే ఆనాపానసతి .. చివరికి కనుక్కునే ఉపాయమే ఆనాపానసతి.

ధ్యానం చేసే పద్ధతి 

  • సుఖాసనంలో హాయిగా కూర్చుని చేతులు రెండూ కలిపి, కళ్ళు రెండూ మూసుకుని ప్రకృతి సహజంగా జరుగుతూన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే  ఏకధారగా గమనిస్తూ వుండాలి. 
  • ఏ దేవతారూపాన్నీ, ఏ గురు రూపాన్నీ ప్రత్యేకంగా ఊహించుకోరాదు. ఏ దైవ నామస్మరణా  వుండరాదు.
  • ఈ విధమైన ఆలోచనారహిత-స్థితిలో కలిగే అనేకానేక శారీరక, నాడీమండల, అత్మానుభవాలను శ్రద్ధగా గమనిస్తూ వుండాలి. ఆ స్థితిలో శరీరం వెలుపల వున్న విశ్వమయ ప్రాణశక్తి .. అపారంగా శరీరంలోకి  ప్రవేశించి .. నాడీమండలాన్ని  శుద్ధి చేస్తూ వుంటుంది. 
  • ఎవరి వయస్సు ఎంత వుంటుందో .. కనీసం  అన్ని నిమిషాలు .. తప్పనిసరిగా .. రోజుకి రెండు సార్లుగా .. ధ్యానం  చెయ్యాలి.  ఈ విధంగా ప్రతి రోజూ నియమబద్ధంగా ధ్యాన అభ్యాసాన్ని అలవాటు చేసుకోవాలి.


ధ్యానం వల్ల లాభాలు


  • ధ్యాన సాధన ద్వారా శారీరక, మానసిక అనారోగ్యాలైన బి.పి, షుగరు, చర్మ వ్యాధులు, డిప్రెషన్, వెన్నునొప్పి, కాన్సరు, గుండెనొప్పి వంటి సమస్త వ్యాధులు తగ్గుతాయి మరియు దుర్గుణాలు, దురలవాట్లు కూడా పోగొట్టుకోవచ్చు.
  • మానసిక ఆందోళనలు, ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతతను పొందవచ్చు.
  • జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, బుద్ధికుశలత మొదలైనవి పెరుగుతాయి.
  • ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరిగి జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను, లాభ నష్టాలను సమబుద్ధితో స్వీకరించగలరు.
  • మూఢ నమ్మకాలు, భయాలు పోయి చావు-పుట్టుకల జ్ఞానం ద్వారా మరణభయాన్ని కూడా జయించగలరు.
  • ధ్యానం మనిషిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి, హింస నుండి అహింస వైపు, అజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు, మానవత్వం నుండి దైవత్వం వైపు నడిపిస్తుంది.

మెడిటేషన్ వల్ల లాభాలు


మెడిటేషన్ అనేది ఒక పురుషులకు లేదా ఆధ్యాత్మిక గురువులకు మాత్రమే అనుకుంటారు. అయితే ధ్యానం కేవలం ఒక మతపరమైన అనుభవం కాదు. మీరు ఇది ఆధ్మాత్మికత అని చెప్పవచ్చు కానీ ఇది ప్రధానంగా మీ ఆరోగ్యాన్నిక మెరుగుపరుచుకోవడానికి ఒక మార్గం అని చెప్పవచ్చు . 
  • మెడిటేషన్ వల్ల మీకు తెలియని అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. మెడిటేషన్ వల్ల మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యం మెరుగుపచడం మాత్రేమే కాదు, మెడిటేషన్ వల్ల భౌతిక ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే మీ భావోద్వేగ ఆరోగ్యం మీ భౌతిక ఆరోగ్యం ఫిట్ నెస్ మీద ప్రభావం చూపుతుంది. 
  • మెడిటేషన్ వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రస్తుత రోజుల్లో ఒత్తిడి తగ్గించుకోవడానికి మెడిటేషన్ ఒక అత్యవసర మార్గంగా ఏర్పడింది. 
  • ఒక్క మానసిక, భౌతిక ఆరోగ్యంకోసం మాత్రమే కాదు, బరువు తగ్గించుకోవడానికి, ఒత్తిడి మరియు ఆందోళన రుగ్మతలను నివారించుకోవడం కోసం మెడిటేషన్ అద్భుతంగా సహాయపడుతుంది. 
  • అయితే మెడిటేషన్ ను సరిగా ఎలా చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కరెక్టైన పద్దతిలో, కరెక్టైన సమయంలో మెడిటేషన్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. లేదంటే, ఈ వ్యాయామం వల్ల ఇది వ్యర్థం అవుతుంది. 
  • అంటే మెడిటేషన్ చేసే సమయంలో మీ ఏకాగ్రత వేరే ఎక్కడా ఉండకూడదు, మనస్సు నిలకడగా ఉంచుకోవాలి. మెడిటేషన్ చేసే సమయంలో ఇతర ఆలోచనలు కట్టిపెట్టాలి. ఫోన్ కాల్స్ చూడటం, మెయిల్స్ చెక్ చేయడం వంటి పనులు చేయకూడదు . మెడిటేషన్ చేయడానికి మీరు పూర్తిగా సమయాన్ని వెచ్చించాలి. 
  • మెడిటేషన్ వల్ల నిద్రలేమి మరియు డిప్రెషన్ వంటి సమస్యలు నేచురల్ గా మరియు ఎఫెక్టివ్ గా నివారించబడుతాయి. 
మెడిటేషన్ వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ... 
స్ట్రెస్ రిలీఫ్

నిద్రపట్టేందుకు సహాయపడుతుంది 


కోపాన్ని కంట్రోల్ చేస్తుంది 


బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది 


భావోద్వేగాలను స్థిరంగా ఉంచుతుంది 



శ్వాస సంబంధిత సమస్యలకు నివారిస్తుంది 


వ్యాధినిరోధకతను మెరుగుపరుస్తుంది

కండరాల తిమ్మెర్లను నివారిస్తుంది

జ్ఝాపకశక్తిని మెరుగుపరుస్తుంది


Thursday, April 18, 2019

మానసిక రుగ్మతలుంటే మరణశిక్ష వద్దు : సుప్రీంకోర్టు


మరణశిక్ష పడ్డ నిందితులు దానిని అమలు చేసేలోగా తీవ్రమైన మానసిక రుగ్మతకు లోనయితే వారిని ఉరి తీయొద్దంటూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. 1999లో మహారాష్ట్రలో ఇద్దరు మైనర్‌ బాలికలపై అత్యాచారం చేసి, హతమార్చిన వ్యక్తికి ఉరిశిక్ష పడగా, ప్రస్తుతం అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఈమేరకు తీర్పు చెప్పింది. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆధ్వర్యంలోని జస్టిస్‌ శంతనగౌండర్‌, జస్టిస్‌ ఇందిరా బెనర్జీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. నేరం చేసినట్టు కోర్టు నిర్ధరించిన తరువాత నిందితుడు మానసిక రుగ్మతకు లోనయితే కేసును ఎలా చూడాలన్న సంక్ష్లిష్ట ప్రశ్నలకు ధర్మాసనం సమాధానాలు ఇచ్చింది. అలాంటి సందర్భాల్లో మరణశిక్షను అమలు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది.

సిప్లా ఛైర్మన్‌ హమీద్‌కు బ్రిటన్‌ రాయల్‌ సొసైటీ గౌరవం


ప్రముఖ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, ఔషధ రంగ దిగ్గజ సంస్థ సిప్లా ఛైర్మన్‌ యూసుఫ్‌ హమీద్‌(82)కు బ్రిటన్‌ రాయల్‌ సొసైటీ గౌరవం దక్కింది. ప్రపంచంలోని ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కూడిన రాయల్‌ సొసైటీ గౌరవ ఫెలోగా హమీద్‌ 2019 సంవత్సరానికి ఎంపికయ్యారు. ఆయనతోపాటు 51 మందికి ఈ పురస్కారం దక్కింది. భారత సంతతి శాస్త్రవేత్తల్లో ప్రొఫెసర్‌ గురుదయాళ్‌ బెస్రా, ప్రొఫెసర్‌ మంజుల్‌ భార్గవ, ప్రొఫెసర్‌ అనంత్‌ పరేఖ్‌, ప్రొఫెసర్‌ అక్షయ్‌ వెంకటేష్‌లు  పురస్కారానికి ఎంపికయ్యారు. 
  • బ్రిటన్‌ రాయల్‌సొసైటీ ఫెలోగా ఎంపికైన భారత తొలి మహిళా శాస్త్రవేత్తగా ప్రొఫెసర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ రికార్డు సృష్టించారు. కాంగ్‌ ఫరీదాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌, టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు  నిర్వర్తిస్తున్నారు. చిన్నారుల్లో వైరల్‌ ఇన్‌ఫెక్షన్లపై ఆమె పరిశోధనలు  నిర్వహించారు.