Friday, August 18, 2023

Antim Fungal : ప్రపంచ అండర్‌-20 టోర్నమెంట్ టైటిల్‌ విజేత అంతిమ్‌ ఫంగాల్‌

Antim Fungal-4a-successsecret

  • భారత యువ రెజ్లర్‌ అంతిమ్‌ ఫంగాల్‌ ప్రపంచ అండర్‌-20 టోర్నమెంట్లో టైటిల్‌ నిలబెట్టుకుని ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. 53 కేజీల విభాగం ఫైనల్లో అంతిమ్‌ 4-0తో మరియా ఎఫ్రిమోవా (ఉక్రెయిన్‌)ను ఓడిరచింది. 
  • అంతిమ్‌ కుందు (65 కేజీ) రజతం గెలుచుకుంది. ఆమె 2-9తో ఇనికో ఎల్కెస్‌ (జోర్డాన్‌) చేతిలో ఓడిరది. 
  • 57 కేజీల కేటగిరిలో రీనా కాంస్యం సొంతం చేసుకుంది. ఆమె 9-4తో ఒమిర్‌బెక్‌ (కజకిస్థాన్‌)ను ఓడిరచింది. అర్జూ (68 కేజీ), హర్షిత (72 కేజీ) కూడా కాంస్యాలు నెగ్గారు.


World Under-20 tournament title winner Antim Fungal

  • Indian young wrestler Antim Fungal created history by becoming the first Indian woman wrestler to achieve this feat by retaining the title in the World Under-20 tournament. In the final of the 53 kg category, she defeated Maria Efrimova (Ukraine) 4-0.
  • The final Kundu (65 kg) won the silver. She lost 2-9 to Iniko Elkes (Jordan).
  • Reena won bronze in 57 kg category. She defeated Omirbek (Kazakhstan) 9-4. Arju (68 kg) and Harshita (72 kg) also won bronze medals.

saliva sample : లాలాజల నమూనా పరీక్షతో హృద్రోగ ముప్పును పసిగట్టగల విధానాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు?

 

saliva sample-successsecret

  • గుండె-రక్తనాళాల సంబంధిత వ్యాధుల ముప్పును కేవలం లాలాజల నమూనా పరీక్షతో ముందుగానే పసిగట్టగల సరికొత్త విధానాన్ని కెనడాలోని మౌంట్‌ రాయల్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 
  • సాధారణంగా చిగుళ్ల ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల పీరియడాంటైటిస్‌ అనే ఇన్‌ఫెక్షన్‌ తలెత్తుతుంది. దాని బాధితుల్లో ఇన్‌ఫ్లమేటరీ కారకాలు చిగుళ్ల ద్వారా రక్తప్రవాహంలోకి ప్రవేశించి.. రక్తనాళ వ్యవస్థకు హాని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 
  • ఈ నేపథ్యంలో- లాలాజలంలో తెల్ల రక్తకణాల స్థాయులను గుర్తించడం ద్వారా హృదయం-రక్తనాళాల సంబంధిత వ్యాధుల రాక ముప్పును ముందుగానే తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు తాజా పరిశోధనల్లో గుర్తించారు. 
  • పలువురు వ్యక్తులను సెలైన్‌తో పుక్కిలించేలా చేసి.. తద్వారా సేకరించిన లాలాజల నమూనాలను వారు విశ్లేషించారు. లాలాజలంలో తెల్ల రక్తకణాల స్థాయులు ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో.. రక్తనాళాలు బిరుసుగా మారుతున్నాయని, రక్తప్రవాహానికి అనుగుణంగా వ్యాకోచించే సామర్థ్యం వాటికి తక్కువగా ఉంటోందని నిర్ధారించారు. అలాంటి వ్యక్తుల్లో హృద్రోగాల ముప్పు పెరుగుతోందని తేల్చారు.


Which country's scientists have discovered a way to detect the risk of heart disease by testing a saliva sample?

  • Scientists at Mount Royal University in Canada have discovered a new way to detect the risk of cardiovascular diseases by simply testing a saliva sample.
  • An infection called periodontitis is usually caused by inflammation of the gums. In its victims, inflammatory factors are more likely to enter the bloodstream through the gums and damage the vascular system.
  • In this context, scientists have found out in the latest research that by detecting the levels of white blood cells in saliva, the risk of cardiovascular diseases can be detected early.
  • They analyzed the saliva samples collected by having several people gargle with saline. In people with high levels of white blood cells in saliva, it was concluded that the blood vessels become narrower and their ability to dilate according to the blood flow is less. It was concluded that the risk of heart disease is increasing in such people.

Parthasarathi Reddy and Ayodhya Ramireddy : రాజ్యసభ సభ్యుల్లో అత్యధిక ధనవంతులుగా నిలిచిన పార్థసారథిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి ఏ పార్టీకి చెందినవారు?

Parthasarathi Reddy and Ayodhya Ramireddy-successsecret

  • తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారాస, వైకాపాలకు చెందిన సభ్యులు.. అత్యధిక ఆస్తి విలువలతో జాతీయపార్టీల సభ్యుల కంటే పై స్థానంలో నిలిచారు. పెద్దలసభలో అత్యధిక ఆస్తులున్న ఎంపీలుగా తొలి రెండు స్థానాల్లో భారాస ఎంపీ బండి పార్థసారథిరెడ్డి, వైకాపా ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డిలు నిలిచారు. 
  • పార్థసారథిరెడ్డి ఆస్తుల విలువ రూ.5300 కోట్లు కాగా, అయోధ్యరామిరెడ్డి ఆస్తుల విలువ రూ.2,577 కోట్ల మేర ఉంది. రాజ్యసభలో 225 మంది సభ్యుల ఆస్తుల విలువ రూ. 18,210 కోట్లు కాగా.. అందులో వీరిద్దరి సంపదే 43.25 శాతం ఉంది. భారాస, వైకాపాలకు చెందిన 16 మంది ఆస్తుల విలువలో వీరి వాటా ఏకంగా 86.02 శాతం. 
  • వీరి తర్వాతి స్థానంలో రూ. 1001 కోట్లతో అమితాబ్‌ బచ్చన్‌ సతీమణి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్‌ నిలిచారు. ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 233 మంది సభ్యుల్లో 225 మంది అఫిడవిట్‌లను పరిశీలించి  అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ ఈ వివరాలు వెల్లడిరచింది. 
  • రాజ్యసభలో అతిపెద్ద పార్టీలుగా ఉన్న భాజపా (85) కాంగ్రెస్‌ (30)లకు చెందిన 115 మంది సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.4,128 కోట్లయితే, భారాస (7), వైకాపా (9)లకు చెందిన 16 మంది సభ్యుల ఆస్తి విలువ రూ.9,157 కోట్ల మేర నమోదైంది. ఈ విషయాన్ని ఏడీఆర్‌ సంస్థ 2023 ఆగస్టు 18న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
  • పార్టీలవారీగా చూస్తే భారాస సభ్యుల మొత్తం ఆస్తి విలువ రూ.5,596 కోట్లు కాగా, వైకాపా సభ్యులు రూ.3,561 కోట్లు, భాజపా సభ్యులు రూ.2,579 కోట్లు, కాంగ్రెస్‌ సభ్యులు రూ.1,549 కోట్లు, ఆప్‌ సభ్యులు రూ.1,316 కోట్లు, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు రూ.1,019 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు.
  • రాష్ట్రాలవారీగా సభ్యుల ఆస్తుల విలువలో తెలంగాణ (రూ.5,596 కోట్లు), ఆంధ్రప్రదేశ్‌ (రూ.3,823 కోట్లు) తొలి రెండుస్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌ (రూ.1,941 కోట్లు), పంజాబ్‌ (రూ.1,136 కోట్లు), మహారాష్ట్ర (రూ.1,070) నిలిచాయి.
  • 225 మంది సభ్యుల్లో 27 (12%) మంది అపర కోటీశ్వరులు (బిలియనీర్లు). ఇందులో భాజపా వారు ఆరుగురు, కాంగ్రెస్‌ నలుగురు, వైకాపా నలుగురు, ఆప్‌ ముగ్గురు, భారాస ముగ్గురు, ఆర్జేడీ నుంచి ఇద్దరు ఉన్నారు. వీరు ఒక్కొక్కరు రూ.100 కోట్లకు పైగా ఆస్తులు ప్రకటించారు.
  • ఆంధ్రప్రదేశ్‌ ఎంపీల్లో 45%, తెలంగాణ ఎంపీల్లో 43%, దిల్లీ ఎంపీల్లో 33%, పంజాబ్‌ ఎంపీల్లో 29% బిలియనీర్లు ఉన్నారు.
  • అత్యధిక అప్పులున్న ఎంపీల్లోనూ వైకాపా సభ్యులు తొలి రెండుస్థానాల్లో ఉన్నారు. వీరిలో పరిమళ్‌ నత్వానీకి రూ.209 కోట్లు, ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి రూ.154 కోట్ల అప్పులున్నాయి.
  • ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయం చూపిన ఎంపీల్లో ఆళ్ల అయోధ్యరామిరెడ్డి (రూ.279 కోట్లు), బండి పార్థసారథి రెడ్డి (రూ.140 కోట్లు), అభిషేక్‌ మనుసింఫ్వీు (రూ.131 కోట్లు) తొలి మూడు స్థానాలను ఆక్రమించారు.

75 మందిపై క్రిమినల్‌ కేసులు

  • 225 మంది ఎంపీల్లో 75 (33%) మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. అందులోనూ 41 (18%) మందిపై తీవ్రమైన నేరాలు నమోదయ్యాయి. ఇద్దరు ఎంపీలపై ఐపీసీ 302 సెక్షన్‌ కింద హత్యకేసులున్నాయి. 
  • మరో నలుగురిపై ఐపీసీ 307 కింద హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఇంకో నలుగురు ఎంపీలు.. మహిళలపై నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు.. కాంగ్రెస్‌ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌పై ఐపీసీ సెక్షన్‌ 376 కింద అత్యాచార కేసు ఉంది.


Parthasarathi Reddy and Ayodhya Ramireddy who are the richest Rajya Sabha members belong to which party?

  • The members from Bharasa and Vaikapa representing the Rajya Sabha from the Telugu states have ranked higher than the members of the national parties with the highest property values. Bharas MP Bandi Parthasarathi Reddy and Vaikapa MP Alla Ayodhya Ramireddy are the MPs with the most assets in the Peddal Sabha.
  • Parthasarathi Reddy's assets are worth Rs.5300 crores, while Ayodhya Ramireddy's assets are worth Rs.2,577 crores. The assets of 225 members of the Rajya Sabha are worth Rs. 18,210 crores.. out of which the wealth of these two is 43.25 percent. Their share in the property value of 16 people belonging to Bharasa and Vaikapa is 86.02 percent.
  • Next to them is Rs. Amitabh Bachchan's wife and Samajwadi Party MP Jaya Bachchan stood with 1001 crores. The Association for Democratic Reforms (ADR) has revealed these details after examining the affidavits of 225 of the 233 members currently representing the Rajya Sabha.
  • The total assets of 115 members of BJP (85) and Congress (30), which are the largest parties in the Rajya Sabha, are worth Rs 4,128 crore, while the assets of 16 members of Bharatiya Janata Party (7) and Vaikapa (9) are worth Rs 9,157 crore. This has been stated by the ADR organization in a report released on August 18, 2023.
  • The total property value of Bharatiya Janata Party members is Rs.5,596 crores, while Vaikapa members have Rs.3,561 crores, BJP members have Rs.2,579 crores, Congress members have Rs.1,549 crores, AAP members have Rs.1,316 crores and Samajwadi Party members have properties worth Rs.1,019 crores. have
  • Telangana (Rs. 5,596 crores) and Andhra Pradesh (Rs. 3,823 crores) are in the first two places in the value of assets of members by states. It was followed by Uttar Pradesh (Rs. 1,941 crore), Punjab (Rs. 1,136 crore) and Maharashtra (Rs. 1,070).
  • Of the 225 members, 27 (12%) are extra-millionaires (billionaires). In this there are six from BJP, four from Congress, four from Vaikapa, three from AAP, three from Bharas and two from RJD. They have declared assets of more than Rs.100 crore each.
  • 45% of Andhra Pradesh MPs, 43% of Telangana MPs, 33% of Delhi MPs and 29% of Punjab MPs are billionaires.
  • Vaikapa members are in the first two positions among MPs with the highest debts. Among them, Parimal Natwani has Rs.209 crores and Alla Ayodhya Ramireddy has Rs.154 crores.
  • Alla Ayodhyarami Reddy (Rs. 279 crores), Bandi Parthasarathy Reddy (Rs. 140 crores) and Abhishek Manusimphviu (Rs. 131 crores) occupied the top three positions among the MPs who showed the highest income in a financial year.

Criminal cases against 75 people

  • Out of 225 MPs, 75 (33%) have criminal cases against them. Out of that 41 (18%) people were charged with serious crimes. There are murder cases against two MPs under IPC section 302.
  • Cases of attempt to murder under IPC 307 have been registered against four others. Four more MPs.. are facing charges of committing crimes against women.. There is a case of rape under Section 376 of the IPC against Congress General Secretary for Organizational Affairs KC Venugopal.

Andhra Pradesh State Agnikulakshatriya Corporation : ఇటీవల మృతి చెందిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అగ్నికులక్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఎవరు?

 

Bandana Hari-successsecret

  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బందన హరి(64) 2023 ఆగస్టు 18న మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 
  • 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన కాకినాడ స్టీల్‌ బార్జి అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా కాకినాడ నగర నియోజకవర్గం నుంచి పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం వైకాపాలో చేరి రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.


Who is the Chairman of Andhra Pradesh State Agnikulakshatriya Corporation who passed away recently?

  • Andhra Pradesh State Agnikula Kshatriya Corporation Chairman Bandana Hari (64) passed away on August 18, 2023. He has a wife, two sons and three daughters.
  • He has been in politics for 40 years and served as the President of Kakinada Steel Barge Association. In 2019, he contested from Kakinada city constituency as a Praja Rajyam Party candidate and was defeated by a narrow margin. Later, he joined Vaikapa and was appointed as the Chairman of State Agnikula Kshatriya Corporation.

APPSC : ఏపీపీఎస్సీ రాత పరీక్షలకు తేదీలు ఖరారు

  • ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 11 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల రాత పరీక్షల  తేదీలను 2023 ఆగస్టు 17న ప్రకటించింది. 
  • ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు రాత పరీక్షలు సెప్టెంబరు 25 నుంచి 27వ తేదీ వరకు జరుగుతాయి. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (భూగర్భ నీటిపారుదల శాఖ), అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌, ఇండస్ట్రీయల్‌ ప్రమోషన్‌ ఆఫీసర్‌, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌, గ్రూపు-4 (లిమిటెడ్‌), జూనియర్‌ ట్రాన్సలేటర్‌ తెలుగు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (మైన్స్‌), డిస్ట్రిక్ట్‌ ప్రొబెషన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 (జువైనల్‌ వెల్ఫేర్‌) ఉద్యోగాలకు జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ పరీక్ష అక్టోబరు 3న జరగనుంది. 
  • ఈ ఉద్యోగాలకు సంబంధించి సబ్జెక్టు రాత పరీక్షలు వేర్వేరు తేదీల్లో ఆన్‌లైన్‌లో జరుగుతాయి.


Dates for APPSC written exams are finalised

  • Andhra Pradesh Public Service Commission has announced the dates of written examination for 11 posts recruitment notification on 17th August 2023.
  • The written examination for the posts of Forest Range Officer will be held from September 25 to 27. Civil Assistant Surgeon, Technical Assistant (Ground Irrigation Department), Assistant Inspector of Fisheries, Industrial Promotion Officer, Food Safety Officer, Group-4 (Limited), Junior Translator Telugu, Technical Assistant (Mines), District Probation Officer Grade-2 (Juvenile the General Studies and Mental Ability Test for Welfare) Jobs will be held on October 3.
  • Subject wise written tests for these jobs will be conducted online on different dates.

APPSC : గ్రూప్‌-1 ఫలితాలు

  • గ్రూప్‌-1 (28/2022 నోటిఫికేషన్‌) ఉద్యోగాలకు ఎంపిక చేసిన అభ్యర్థులను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. 111 ఉద్యోగాల భర్తీకి ఎంపిక చేసిన వారిలో 33 మంది మహిళలు ఉన్నారు. ఈ వివరాలను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతం సవాంగ్‌ 2023 ఆగస్టు 17న వెల్లడిరచారు. 

రాష్ట్ర పోస్టులకు ఎంపికైన 14 మంది మహిళలు

  • ఎంపిక జరిగిన 111 పోస్టుల్లో రాష్ట్ర కేడర్‌కు చెందిన డిప్యూటీ కలెక్టర్‌ 13, సీటీఓ-13, డీఎస్పీ-(సివిల్‌) 13, డీఎస్పీ (జైళ్లు) 2, డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌-2, ఏటీఓ (టీ అండ్‌ ఏ సర్వీస్‌) పోస్టులు 11 ఉన్నాయి. డీఎస్పీ (జైళ్లు), డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టుల మినహా మిగిలిన పోస్టులకు ఎంపికైన వారిలో 14 మంది మహిళలు ఉన్నారు.

గ్రూప్‌`1 ఉద్యోగాలకు ఎంపికైన వారిలో తొలి అయిదుగురు అభ్యర్థులు

అభ్యర్థి పేరు విద్యార్హత వర్సీటీ

1. భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష బీఏ పొలిటికల్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఢల్లీి

2. భూమిరెడ్డి పావని బీటెక్‌ ఈసీఈ జేఎన్‌టీయూ, అనంతపురం

3. కె.లక్ష్మీప్రసన్న బీటెక్‌ ఐటీ జేఎన్‌టీయూ, అనంతపురం

4. కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి బీటెక్‌ ఈఈఈ జేఎన్‌టీయూ, అనంతపురం

5. ఎం.భానుప్రకాష్‌రెడ్డి బీఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఉస్మానియా యూనివర్సిటీ


APPSC Group-1 Results

  • Andhra Pradesh Public Service Commission announced the selected candidates for Group-1 (Notification 28/2022). Out of the 111 posts selected, 33 are women. These details were disclosed by APPSC Chairman Gautam Sawang on 17th August 2023.

14 women selected for state posts

  • - Among the 111 posts selected are Deputy Collector 13, CTO-13, DSP (Civil) 13, DSP (Prisons) 2, District Fire Officer-2, ATO (T&A Service) 11 posts of the state cadre. Apart from the posts of DSP (Jails) and District Fire Officer, there are 14 women selected for the remaining posts.

The first five candidates are selected for Group `1 posts

Name of Candidate Qualification Varsity

1. Bhanushree Lakshmi Annapurna Pratyusha BA Political Science, Economics University of Delhi

2. Bhumi Reddy Pavani B.Tech ECE JNTU, Anantapur

3. K. Lakshmiprasanna B.Tech IT JNTU, Anantapur

4. K. Praveenkumar Reddy B.Tech EEE JNTU, Anantapur

5. M.Bhanuprakash Reddy BA Public Administration Osmania University

STEMI project : స్టెమీ ప్రాజెక్టుతో గుండెకు రక్ష

  • రాష్ట్ర ప్రజల ఆరోగ్య రక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరణ సహా అనేక కార్యక్రమాలు చేపట్టింది. గుండె జబ్బులు, కేన్సర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది.
  • కార్డియాలజీ, కార్డియోవాస్క్యులర్‌ సేవలను మరింతగా విస్తృతం చేసి, ప్రజలకు చేరువ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో గుండె జబ్బులతో బాధపడే గ్రామీ­ణుల­కు సత్వర వైద్య సేవలందించి, వారిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు.
  • ఎస్‌టీ ఎలివేషన్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌ (స్టెమి)గా పిలిచే ఈ కార్యక్రమం ద్వారా గుండెపోటు బాధితులకు గోల్డెన్‌ అవర్‌లో 40 నిమిషాల్లోనే చికిత్స అందిస్తారు. తద్వారా బాధితులు ప్రాణాపాయం నుంచి బయటపడటానికి వీలుంటుంది. ఇప్పటికే తిరుపతి రుయా ఆస్పత్రిలో దీనిని పైలెట్‌ ప్రాజెక్టుగా వైద్య, ఆరోగ్య శాఖ అమలులో పెట్టింది.
  • రెండో దశ పైలెట్‌ ప్రాజెక్టును సెప్టెంబర్‌ 29 నుంచి కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం కేంద్రంగా ప్రాజెక్టును అమలు చేస్తారు. జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు. ఈలోగా పాత 11 బోధనాస్పత్రుల్లో కార్డియాలజీ, కార్డియో వాస్క్యులర్‌ (సీటీవీఎస్‌) విభాగాలను బలోపేతం చేస్తారు. ఇందుకోసం కార్డియాలజీ, క్యాథ్‌లాబ్‌, సీటీవీఎస్‌ విభాగాల్లో 94 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వివిధ ఆస్పత్రుల్లో రూ.120 కోట్లతో క్యాథ్‌లాబ్స్‌ను సమకూర్చింది.

గుండె సంబంధిత వ్యాధులతోనే 32.4 శాతం మరణాలు 

  • రాష్ట్రంలో సంభవిస్తున్న మరణాల్లో 32.4 శాతం గుండె సంబంధిత వ్యాధుల కారణంగానే ఉంటున్నాయి. రాష్ట్రంలో 38 లక్షల మందికి పైగా గుండె జబ్బుల బాధితులున్నారు. నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ)లో గుండె జబ్బులదే అగ్రస్థానం. 
  • ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ద్వారా బీపీ, షుగర్‌, ఇతర ఎన్‌సీడీ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై నిరంతర ఫాలోఅప్‌ ఉంచుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్‌ వ్యాధులపై ఫోకస్‌ పెట్టారు. సత్వరమే నాణ్యమైన చికిత్సను అందించడం ద్వారా మరణాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా స్టెమీ ప్రాజెక్టు చేపట్టారు.


Protect the heart with the STEMI project

  • As part of the health protection of the people of the state, the government of Andhra Pradesh has undertaken many programs including the modernization of government hospitals from the village level to the state level. Special focus on heart disease and cancer.
  • Andhra Pradesh Chief Minister YS Jagan has issued orders to expand cardiology and cardiovascular services and make them accessible to the people. In this order, a special program has been designed to provide prompt medical services to villagers suffering from heart diseases and save them from life-threatening condition.
  • Called ST Elevation Myocardial Infarction (STEMI), heart attack victims are treated within 40 minutes of the golden hour. So that the victims can get out of danger. The Medical and Health Department has already implemented this as a pilot project in Tirupati Ruya Hospital.
  • The second phase of the pilot project will be implemented from September 29 in Kurnool, Guntur and Visakhapatnam. It will be spread across the state from January. In the meantime, Cardiology and Cardio Vascular (CTVS) departments will be strengthened in the old 11 teaching hospitals. For this, the government has sanctioned 94 posts in cardiology, cathlab and CTVS departments. It has provided cath labs at a cost of Rs.120 crores in various hospitals.

32.4 percent deaths are due to heart related diseases

  • 32.4 percent of the deaths occurring in the state are due to heart related diseases. More than 38 lakh people are suffering from heart diseases in the state. Heart disease is the leading non-communicable disease (NCD).
  • Continuous follow-up on the health of BP, sugar and other NCD patients is being done through family doctor system. Especially focused on heart diseases and cancer diseases. Measures are being taken to reduce mortality by providing prompt and quality treatment. As a part of this, STEMI project was undertaken.