Friday, September 2, 2016

బెంగాలీ శ్రోతలకు ఆకాశవాణి మైత్రి రేడియో ఛానల్‌


బెంగాలీ శ్రోతల కోసం ఆకాశవాణి మైత్రి రేడియో ఛానల్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో 2016 ఆగస్టు 23న ప్రారంభించారు. బెంగాలీ సంస్క తిని ప్రతిబింబిస్తూ భారత్‌ - బంగ్లాదేశ్‌ సమ్మిళిత సమాచారంతో ఈ ఛానల్‌ కార్యక్రమాలను అందిస్తుంది.

కశ్మీర్‌లో బీఎస్‌ఎఫ్‌ మోహరింపు


కశ్మీర్‌లో 12 ఏళ్ల తర్వాత తొలిసారిగా సరిహద్దు భద్రతాదళం (BSF)  మోహరించింది. శ్రీనగర్‌లోని ప్రముఖ వాణిజ్యప్రాంతం లాల్‌చౌక్‌, ఆ పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతలు పర్యవేక్షణ బాధ్యతలను BSFకు అప్పగించినట్లు పోలీసు వెల్లడించారు.

BSF - Border Security Force


నరేంద్రమోడి సూటు గిన్నిస్‌ రికార్డు


భారత ప్రధాని నరేంద్రమోడి ధరించిన సూటు గిన్నిస్‌ ప్రపంచ రికార్డు సాధించింది. డిల్లీలో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాను కలిసినపుడు మోడి వేసుకున్న ఈ సూటు అప్పట్లో వివాదాకు దారితీసింది. అదే వేలంలో అమ్ముడైన అత్యంత ఖరీదైన సూటుగా (రూ.4.31 కోట్లు) రికార్డుకెక్కింది. దీన్ని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి లాల్జీభాయ్‌ తుల్సీభాయ్‌ పటేల్‌ 2015 ఫిబ్రవరి 20న దక్కించుకున్నారు. సూటుపై నరేంద్ర దామోదరదాస్‌ మోదీ అనే బంగారు అక్షరాలను సైతం అమర్చారు. ఈ సూటు ద్వారా లభించిన మొత్తాన్ని గంగా ప్రక్షాళన కార్యక్రమానికి విరాళంగా ఇచ్చారు.


లాల్జీభాయ్‌ తుల్సీభాయ్‌ పటేల్‌



Thursday, September 1, 2016

కాబుల్‌లో దారుల్‌ అమన్‌ సౌధం ప్రారంభం



అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో పునరుద్ధరించిన దారుల్‌ అమన్‌ సౌధం (స్టోర్‌ ప్యాలెస్‌)ను ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్‌ఘనీ, భారత ప్రధాని నరేంద్రమోడి ప్రత్యక్ష ప్రసార సదస్సు ద్వారా ప్రారంభించారు. దారుల్‌ అమన్‌ సౌధాన్ని మొదట 1920ల్లో అఫ్గాన్‌ రాజు అమానుల్లాఖాన్‌ నిర్మించారు. అనేక చారిత్రక ఘటనలకు ఈ భవనం సాక్షిగా నిలిచింది.


బ్రహ్మొస్ నూతన రెజిమెంట్ ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు?


బ్రహ్మోస్‌కు సంబంధించిన అధునాతన శ్రేణి క్షిపణులతో సైన్యంలోని ఒక కొత్త రెజిమెంట్‌ను ఏర్పాటు చేయడానికి 2016 ఆగస్టు మొదటివారంలో మొదట్లో ప్రధాని మోడి నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనిపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. రూ.4,300 కోట్లతో ఏర్పాటుచేసే ఈ రెజిమెంట్‌ను అరుణాచల్‌ప్రదేశ్‌లో మోహరిస్తారు. ఈ రాష్ట్రం తమదని చైనా వాదిస్తోంది. అక్కడి వాస్తవాధీన రేఖ వెంబడి గత కొన్నేళ్లలో ఇరుదేశాల దళాలు మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అక్కడ మోహరించబోయే బ్రహ్మోస్‌ క్షిపణిని పర్వత ప్రాంతాల్లో యుద్ధం కోసం ప్రత్యేకంగా రూపొందించారు. సైన్యంలో ఇప్పటికే మూడు బ్రహ్మోస్‌ రెజిమెంట్లు ఉన్నాయి. 

ముస్లింలకు సద్భావన మండపాలు


ముస్లింల  కోసం అన్ని రాష్ట్రాల్లో సద్భావన మండపాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిల్లో సామాజిక కార్యక్రమాలు  నిర్వహించుకోవడంతో పాటు ముస్లింలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాల  అమలుకు కేంద్రంగా నిలిచేలా చూడాలనేది ప్రభుత్వ సంకల్పం.  2011లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోడి ఉన్నప్పుడు చేపట్టిన సద్భావన యాత్ర స్పూర్తితో రూ.6,500 కోట్లతో సద్భావన మండపాల  నిర్మాణాన్ని చేపటనున్నారు

నీతి ఆయోగ్‌ ప్రథమ వార్షికోత్సవం ఎక్కడ జరిగింది?


డిల్లీలో 2016 ఆగస్టు 26న నీతి ఆయోగ్‌ ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా ప్రథమ ఉపన్యాస కార్యక్రమంలో ప్రధాని మోడి ప్రసంగించారు. సంపూర్ణ మార్పును భారత్‌ చవిచూలంటే ఒక్కో మెట్టూ ఎక్కితే సరిపోదని, పూర్తి రూపాంతరణ అవసరమని ఆయన పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మోడితోపాటు కేంద్ర మంత్రివర్గ సభ్యులందరూ పాల్గొన్నారు. సింగపూర్‌ ఉప ప్రధాని తర్మన్‌ షణ్ముగ రత్నం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.