Monday, January 29, 2024

Man ki Baat : ‘మన్‌ కీ బాత్‌’2024 జనవరి 28


  • అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రతిష్ఠ దేశంలో కోట్ల మంది ప్రజలను ఏకం చేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆ సమయంలో దేశ సామూహిక బలం వ్యక్తమైందని అన్నారు. 2024లో తొలి మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో మోదీ 2024 జనవరి 28న మాట్లాడారు. 
  • రామరాజ్యంలో సాగిన పరిపాలనా విధానమే మన దేశ రాజ్యాంగ రూపకర్తలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఈ కారణంగానే అయోధ్యలో రాముడి ప్రతిష్ఠ జరిగిన ఈ నెల 22న ‘దేవ్‌ టూ దేశ్‌’, ‘రామ్‌ టూ రాష్ట్ర’ అని పేర్కొన్నట్లు వివరించారు. 
  • ‘‘ప్రతి ఒక్కరి మనోభావాలు ఒకే రకం. ప్రతి ఒక్కరి భక్తి కూడా అంతే. ప్రతి నోటి వెంట రామ నామమే మోగింది. అందరి మనస్సుల్లో ఉన్నది రాముడే. ప్రస్తుతం చాలా మంది రామ భజనలు చేస్తున్నారు. రాముడికి అంకితమవుతున్నారు. 
  • ఈ నెల 22న రాత్రి దేశమంతా రామజ్యోతిని వెలిగించి దీపావళిని జరుపుకొంది. ఈ సందర్భంగా దేశ సమష్టి శక్తి ప్రకటితమైంది. అదే అభివృద్ధి చెందిన భారత్‌ ప్రతిజ్ఞకు ఆధారం. ఆ శక్తే దేశ పురోగతిని నూతన శిఖరాలకు చేరుస్తుంది’’ అని మోదీ పేర్కొన్నారు. 
  • తన ప్రసంగంలో మోదీ పద్మ అవార్డులను ప్రస్తావిస్తూ.. తాజాగా ఈ పురస్కారాలను పొందినవారంతా అట్టడుగుస్థాయిలో గొప్ప పనులు సాధించేందుకు ప్రచారానికి దూరంగా ఉంటున్నవారేనని వెల్లడిరచారు. రిపబ్లిక్‌ డే ప్రదర్శనలో 20 బృందాలు పాల్గొంటే వాటిలో 11 మహిళలవేనంటూ ప్రస్తుతించారు. కొంతమంది వ్యక్తులు తమ మరణాంతరం కూడా సమాజం పట్ల బాధ్యతలను పూర్తి చేస్తున్నారంటూ అవయవదాతల దాతృత్వాన్ని  ప్రధాని మోదీ శ్లాఘించారు.

No comments:

Post a Comment