Monday, January 29, 2024

Supreme Court : సుప్రీంకోర్టు వజ్రోత్సవాల ప్రారంభం


  • సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ప్రధాని నరేంద్రమోదీ 2024 జనవరి 28న ఢల్లీిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు నూతన వెబ్‌సైట్‌తోపాటు, డిజిటల్‌ రికార్డులు, డిజిటల్‌ కోర్ట్స్‌-2.0ను ఆవిష్కరించారు.
  • ప్రస్తుతం న్యాయ వ్యవస్థకు ఇబ్బందికరంగా మారిన 4 అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పేర్కొన్నారు. ‘అవి 1. కేసుల వాయిదాల నుంచి బయటపడి న్యాయ స్థానాల్లో వృత్తి నైపుణ్య సంస్కృతిని నెలకొల్పడం. 2. న్యాయస్థానాల తీర్పులు జాప్యమయ్యేలా చేస్తూ, న్యాయ వ్యవస్థలను శక్తిమంతమైన వ్యక్తులు తమ గుప్పిట్లో ఉంచుకునే విధంగా వాదనలు సుదీర్ఘంగా సాగకుండా చూడటం. 3. తొలి తరం న్యాయవాదులకూ సమాన అవకాశాలు కల్పించడం. 4. సుదీర్ఘ సెలవులపై చర్చించి ప్రత్యామ్నాయంగా న్యాయవాదులు, న్యాయమూర్తులకు అనువైన సమయంలో పని చేసే అంశంపై ఒక నిర్ణయానికి రావడం’ అని పేర్కొన్నారు. 
  • భారత సర్వోన్నత న్యాయస్థానం 75వ పడిలోకి అడుగుపెట్టింది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకుని 2024 జనవరి 28న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ న్యాయస్థాన వజ్రోత్సవాలను ప్రారంభించారు. 

No comments:

Post a Comment