Monday, January 29, 2024

Rivers : నదుల అనుసంధానంపై కేంద్రంతో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ఒప్పందం


  • కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టు పురోగతిలో భాగంగా కేంద్రంతో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 
  • పర్బతి-కాళిసింధ్‌-చంబల్‌ నదులను ఈశాన్య రాజస్థాన్‌ కెనాల్‌ ప్రాజెక్టులకు అనుసంధానం చేసే ఈ ప్రాజెక్టుతో ఈ రెండు రాష్ట్రాల్లోని 13 జిల్లాలకు తాగునీటి సౌకర్యం, 5.6 లక్షల హెక్టార్ల భూమికి నీటి లభ్యత చేకూరనుంది. కేంద్రం దీనిపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను తయారు చేయించింది. 
  • 2024 జనవరి 28న దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, నదుల అనుసంధాన ప్రాజెక్టు టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌ వెదిరె శ్రీరాం ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌, రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ డీపీఆర్‌కు అంగీకారం తెలిపిన అనంతరం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

No comments:

Post a Comment