- దేశంలో అమలులో ఉన్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంపై సమీక్షకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసినట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడిరచారు.
- రాజ్యాంగంలోని 10వ షెడ్యూలులో ఉన్న ఈ చట్టం చట్టసభ సభ్యులు ఇష్టానుసారం పార్టీలు ఫిరాయించకుండా నిరోధిస్తుంది.
Showing posts with label Committies. Show all posts
Showing posts with label Committies. Show all posts
Monday, January 29, 2024
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం సమీక్షకు నర్వేకర్ కమిటీ
Saturday, October 8, 2016
ఎంపీసీలో ముగ్గురు సభ్యుల నియామకం
వడ్డీ రేట్లను నిర్ణయించే పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) లో ముగ్గురు సభ్యులను ప్రభుత్వం నియమించింది. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్లు చేతన్ ఘటే, దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్ పమి దువా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ ప్రొఫెసర్ రవీంద్ర హెచ్ ధోలాకియాను ఈ కమిటీలో నియమించారు. ఎంపీసీలో మొత్తం ఆరుగురు సభ్యులుంటారు. వీరిలో ముగ్గురిని ప్రభుత్వం మరో ముగ్గురిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమించాని నిర్ణయించారు. వీరు 4 సం॥ల పాటు పదవిలో ఉంటారు. ఆర్బీఐ తరపున ఆర్బీఐ గవర్నరు, ఒక డిప్యూటీ గవర్నరుతో పాటు, బ్యాంకు నియమించే మరో సభ్యుడు/ సభ్యురాలు ఈ కమిటీలో ఉంటారు. ఎంపీసీకి ఆర్బీఐ గవర్నరు ఉర్జిత్ పటేల్ అధ్యక్షత వహిస్తారు.
Friday, October 7, 2016
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయాని అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సు
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలన్న అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సును కేంద్రం ఆమోదించింది. సరిహద్దుల్లో భద్రతను పెంచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, నదులు ఉన్నచోట గస్తీ పెంచాలని సూచించింది. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి మధుకర్గుప్తా నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. 2016 జనవరిలో పఠాన్కోట్లోని వైమానిక స్థావరంపై దాడి నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. గుజరాత్ నుంచి జమ్మూ ప్రాంతం వరకూ అంతర్జాతీయ సరిహద్దు వద్ద పరిస్థితులను మదింపు చేసి కమిటీ ఈ సూచనను చేసింది. భారత్-పాక్ మధ్య ఉన్న 3323 కి.మీ. సరిహద్దుల్లో 1225 కి.మీ. జమ్మూకశ్మీర్ ప్రాంతంలో (నియంత్రణ రేఖ సహా) ఉంది. పంజాబ్లో 533, రాజస్థాన్లో 1037, గుజరాత్లో 508 కి.మీ. సరిహద్దు ఉంది.
దీన్దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి స్మారకోత్సవాలకు రెండు కమిటీలు
దీన్దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి స్మారకోత్సవాలకు గాను ప్రధాని నరేంద్రమోడి రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రధాని అధ్యక్షతన 149 మంది సభ్యుల జాతీయ కమిటీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 23 మంది సభ్యుల కార్యనిర్వాహక కమిటీలు ఏర్పాటు చేశారు. జాతీయ కమిటీలో మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్పేయి, హెచ్డీ దేవెగౌడ, మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్, సుష్మాస్వరాజ్, అరుణ్జైట్లీ, మనోహర్ పారికర్, బీజేపీ అధ్యక్షుడు అమిత్షా ఉన్నారు. కేంద్ర మంత్రి మహేష్ శర్మ కన్వీనర్గా వ్యవహరిస్తారు. జనసంఫ్లు సిద్ధాంతకర్త దీన్దయాళ్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబరు 25న జన్మించారు
షీలా ఖిడే కమిటీ గడువు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9వ షెడ్యూల్లో ఉన్న సంస్థ విభజన కోసం ఏర్పాటైన షీలా ఖిడే కమిటీ గడువును కేంద్ర హోంశాఖ 2017 ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. ఆ షెడ్యూల్లోని సంస్థలు, కార్పొరేషన్ల ఆస్తులు, అప్పును ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేయడం ఈ కమిటీ ప్రధాన విధి. ఇప్పటివరకు 59 సంస్థల విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మిగిలిన 30 సంస్థల విభజన పూర్తిచేయాల్సి ఉంది. ఈ పని పూర్తిచేయడానికి వీలుగా కమిటీ గడువును ఫిబ్రవరి వరకు కేంద్ర హోంశాఖ పొడిగించింది. 2014 మే 30న కమిటీ ఏర్పాటైనప్పుడు నిర్దేశించిన విధివిధానాలే యధావిధిగా కొనసాగుతాయి.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధి మార్గదర్శకాలకు కమిటీ
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధి, నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలపై సిఫార్సు చేసేందుకు కేంద్ర జవనరుల మంత్రిత్వ శాఖ ఐదుగురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. 90 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని కోరింది. ప్రముఖ నీటిపారుదల రంగంలో నిపుణుడు, అంతర్జాతీయ స్థాయిలో కమిటీల్లో పని చేసిన కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ ఎ.డి.మొహిలే కమిటీకి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. జల సంఘం మాజీ సభ్యులు ఎం.గోపాకృష్ణన్, హైడ్రాజీ విభాగం డైరెక్టర్ నిత్యానందరాయ్, రూర్కీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాజీ శాస్త్రవేత్త ఎం.కె.గోయల్తోపాటు కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధి మార్గదర్శకాలకు కమిటీ
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధి, నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలపై సిఫార్సు చేసేందుకు కేంద్ర జవనరుల మంత్రిత్వ శాఖ ఐదుగురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. 90 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని కోరింది. ప్రముఖ నీటిపారుదల రంగంలో నిపుణుడు, అంతర్జాతీయ స్థాయిలో కమిటీల్లో పని చేసిన కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ ఎ.డి.మొహిలే కమిటీకి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. జల సంఘం మాజీ సభ్యులు ఎం.గోపాకృష్ణన్, హైడ్రాజీ విభాగం డైరెక్టర్ నిత్యానందరాయ్, రూర్కీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాజీ శాస్త్రవేత్త ఎం.కె.గోయల్తోపాటు కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు.
Thursday, October 6, 2016
హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్గా చిదంబరం
హోం వ్యవహారాలపై పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్గా కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదంబరం నియమితుయ్యారు. ఆయన పి.భట్టాచార్య స్థానంలో బాధ్యతలు చేపడతారు.
ఇతర పార్లమెంటరీ కమిటీలు`ఛైర్మన్లు
1. చట్టం, న్యాయం ప్రజా ఫిర్యాదు, సిబ్బంది ఆనంద్శర్మ కాంగ్రెస్
2. రవాణా, పర్యాటకం, సంస్కృతి కమిటీ ముకుల్రాయ్ టీఎంసీ
3. రైల్వేస్పై కమిటీ సుదీప్ బందోపాధ్యాయ్ టీఎంసీ
4. ఇంధనంపై కమిటీ వీరేంద్ర కుమార్
5. కార్మికులపై కమిటీ సోమయ్య
6. సైన్స్ కమిటీ రేణుకా చౌదరి కాంగ్రెస్
7. ఆహార వినియోగదారుల వ్యవహారాల కమిటీ దివాకర్రెడ్డి టీడీపీ
Saturday, September 17, 2016
Sunday, September 11, 2016
లోక్సభ ఎథిక్స్ కమిటీ అధ్యక్షుడిగా ఎల్.కె.అద్వానీ
లోక్సభ నైతిక విలువల సంఘం(ఎథిక్స్ కమిటీ) అధ్యక్షుడిగా మరోసారి బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీని స్పీకర్ సుమిత్రా మహాజన్ 2016 సెప్టెంబర్ 7న నియమించారు. నైతిక విలువల సంఘంలో కొత్తగా రాకేష్సింగ్, అక్షయ్ యాదవ్కు చోటు దక్కింది. మిగతా సభ్యులం తా పునర్నియమితులు కాగా వీరిలో మల్లారెడ్డి సహా 12 మంది ఉన్నారు. సభ్యుల అనైతిక ప్రవర్తనకు సంబంధించి వచ్చే ప్రతి ఫిర్యాదునూ ఈ సంఘం పరిశీలిస్తుంది. నైతిక విలువలకు సంబంధించి సుమోటోగా విచారణ చేపట్టే అధికారం ఉంది. మరికొన్ని సంఘాలకు కూడా స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షులను నియమించారు.
సభ్యుల గైర్హాజరు సంబంధిత అంశాలు పి.కరుణాకరన్
ప్రభుత్వ హామీలు రమేష్ పోక్రియాల్ నిశాంక్
పత్రాల సమర్పణ చంద్రకాంత్ బీ ఖైరే
అనుషంగిక శాసనాలు దీలీప్ కుమార్ మున్సఖ్లాల్ గాంధీ
Friday, September 2, 2016
కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం
కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం 2016 ఆగస్టు 26న హైదరాబాద్లో జరిగింది. బోర్డు ఛైర్మన్ రామ్శరణ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ ఏడాది అందుబాటులో ఉండే కృష్ణా జలాలను 63 : 37 నిష్పత్తిలోనే పంచుకోవాలని భావిస్తూ ఇందులో భాగంగా చిన్న నీటిపారుదల కింద నీటి వినియోగాన్ని ఎలా లెక్కించాలనే విషయాన్ని తేల్చేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు. ఆ నిష్పత్తి ప్రకారమే ఈ ఏడాది నీటిని పంచుకుంటారు. ఇందులో చిన్న నీటి పారుదల కింద తెలంగాణకు 89 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 22 టీఎంసీలు కేటాయింపులు ఉన్నాయి. ఈ వినియోగాన్ని ఎలా లెక్కించాలనేది తేల్చాల్సి ఉంది. దీన్ని తేల్చాడానికి రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజినీర్లు, బోర్డు సభ్య కార్యదర్శి ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేశారు. కృష్ణా నదీ జలాల్లో సెప్టెంబరు నెలాఖరు వరకు ఆంధ్రప్రదేశ్ 36 టీఎంసీలు, తెలంగాణ 15 టీఎంసీలు వినియోగించుకునేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అంగీకరించింది. బోర్డు త్రిసభ్య కమిటీ హైదరాబాద్లో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Saturday, August 27, 2016
సివిల్స్ పరీక్షల్లో గరిష్ట వయో పరిమితిని తగ్గించాలని సిఫార్సు
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర సర్వీసుల్లో అధికారుల నియామకానికి నిర్వహించే సివిల్ సర్వీసు పరీక్షల్లో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని తగ్గించాలని నిపుణుల సంఘం సిఫార్సు చేసింది. కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి బి.ఎస్.బస్వాన్ నేతృత్వంలోని ఈ సంఘం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(యూపీఎస్సీ)కి నివేదిక సమర్పించింది. 1960ల్లో గరిష్ట వయోపరిమితి 26 సంవత్సరాలుగా ఉండేది. 1980ల్లో దాన్ని 28కి పెంచారు. ఇపుడు 32 ఏళ్లుగా ఉంది. రాజకీయంగా సున్నితమైన అంశం కావడం వల్లే వివిధ ప్రభుత్వాలు వయోపరిమితిని పెంచుకుంటూ వచ్చాయి.
ఎంసీఐ రద్దునకు నీతి ఆయోగ్ కమిటీ సిఫార్సు
దేశంలో వైద్య విద్యలను ఇప్పటివరకు నియంత్రిస్తూ వస్తున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ)ని రద్దు చేయాలని నీతి ఆయోగ్ కమిటీ సిఫార్సు చేసింది. దాని స్థానంలో కొత్తగా నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఎంసీఐ చట్టం-1956ను సమీక్షించి, అందులో చేపట్టాల్సిన సంస్కరణ గురించి సిఫార్సు చేయడానికి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 2016 మార్చి 28న కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను సమర్పిచింది.
Friday, August 26, 2016
Subscribe to:
Posts (Atom)












