Saturday, August 27, 2016

ఎంసీఐ రద్దునకు నీతి ఆయోగ్‌ కమిటీ సిఫార్సు


దేశంలో వైద్య విద్యలను ఇప్పటివరకు నియంత్రిస్తూ వస్తున్న మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ)ని రద్దు చేయాలని నీతి ఆయోగ్‌ కమిటీ సిఫార్సు చేసింది. దాని స్థానంలో కొత్తగా నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని సూచించింది. ఎంసీఐ చట్టం-1956ను సమీక్షించి, అందులో చేపట్టాల్సిన సంస్కరణ గురించి సిఫార్సు చేయడానికి నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగరియా నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 2016 మార్చి 28న కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను సమర్పిచింది.

No comments:

Post a Comment