Friday, October 7, 2016

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ శత జయంతి స్మారకోత్సవాలకు రెండు కమిటీలు


దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ శత జయంతి స్మారకోత్సవాలకు గాను ప్రధాని నరేంద్రమోడి రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రధాని అధ్యక్షతన 149 మంది సభ్యుల జాతీయ కమిటీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని 23 మంది సభ్యుల కార్యనిర్వాహక కమిటీలు ఏర్పాటు చేశారు. జాతీయ కమిటీలో మాజీ ప్రధానులు అటల్‌ బిహారీ వాజ్‌పేయి, హెచ్‌డీ దేవెగౌడ, మాజీ ఉపప్రధాని ఎల్‌కే అద్వానీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ, మనోహర్‌ పారికర్‌, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఉన్నారు. కేంద్ర మంత్రి మహేష్‌ శర్మ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జనసంఫ్‌లు సిద్ధాంతకర్త దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ 1916 సెప్టెంబరు 25న జన్మించారు

No comments:

Post a Comment