Monday, July 17, 2023

చిప్స్‌లో వాడే అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు



  • అమెరికా - చైనా మధ్య చిప్‌ వార్‌ తీవ్రమైంది. కంప్యూటర్‌ చిప్స్‌లో వినియోగించే అరుదైన ఖనిజాల(షష్ట్రఱజూ ఎa్‌వతీఱaశ్రీం) ఎగుమతులపై డ్రాగన్‌ పట్టు బిగించింది. గాలియం, జర్మేనియం ప్రభుత్వ అనుమతి లేకుండా ఎగుమతి చేయడానికి వీల్లేదని బీజింగ్‌ ఆదేశాలు జారీ చేసింది. 
  • ప్రపంచంలోనే ఈ ఖనిజాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం చైనానే. అమెరికా తయారు చేసే అత్యాధునిక మైక్రోప్రాసెసర్లను చైనాకు విక్రయించడంపై ఆంక్షలు విధించడానికి ప్రతిగా డ్రాగన్‌ ఈ నిర్ణయం తీసుకొంది. 
  • జాతీయ భద్రత, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సోమవారం చైనా వాణిజ్యశాఖ వివరణ ఇచ్చింది. గాలియం, జర్మేనియంను కమ్యూనికేషన్లు, సెమీకండెక్టర్లు, సైనిక పరికరాల్లో అత్యధికంగా వినియోగిస్తారు. దీంతోపాటు సోలార్‌ ప్యానల్స్‌ తయారీలో ఈ ఖనిజాలు కీలకమైనవి. 
  • ప్రస్తుతం సెమీకండెక్టర్లను ఫోన్ల నుంచి వాహనాలు, ఆయుధాలు ఇలా ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్‌ పరికరంలో వినియోగిస్తున్నారు. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య పోరాటానికి ఇవే కేంద్రంగా నిలిచాయి. గత వారం అమెరికా మిత్ర దేశమైన నెదర్లాండ్స్‌ కొన్ని రకాల ప్రత్యేకమైన చిప్‌లను చైనాకు ఎగుమతి చేయడంపై నిషేధం విధించింది. ఈ నిబంధనలతో ఏఎస్‌ఎంఎల్‌ చైనాకు చిప్స్‌ తయారీ యంత్రాల ఎగుమతులపై ఆంక్షలు పడినట్లైంది.
  • చైనాకు సెమీకండెక్టర్లను దక్కనివ్వకుండా చేయాలని అమెరికా చూస్తున్నా- ఆ చిప్‌ల తయారీకి కావలసిన ముడి సరకులపై వాషింగ్టన్‌కు పట్టులేదు. చిప్‌ల తయారీకి కీలకమైన రాగి నిక్షేపాలు చిలీ దేశంలోనే అత్యధికం. వీటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నది చైనాయే. అల్యూమినియం, టంగ్‌స్టన్‌ ఉత్పత్తి చైనా చేతుల్లో కేంద్రీకృతమైంది. లిథియం నిక్షేపాలు దక్షిణ అమెరికా ఖండ దేశాల్లో ఉన్నాయి. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌ మదర్‌బోర్డుల తయారీకి అవసరమైన గాలియం లోహ నిక్షేపాల్లో 95శాతం చైనాలోనే ఉన్నాయి. ఏతావతా చిప్‌ల తయారీలో ఉపయోగించే అన్ని లోహాలపై చైనాకే పట్టు ఉంది. 
  • అమెరికా దీన్ని ఛేదించడానికి కొత్త వ్యూహాలతో ముందుకురానుంది. భవిష్యత్తులో చిప్‌ల కోసం పోరు సైబర్‌ సీమ నుంచి వాస్తవ ప్రపంచానికి విస్తరిస్తుంది. ఆర్థిక, రాజకీయ, సైనిక పరంగా తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుంది. చిప్‌ల రూపకల్పన, ప్రత్యేక యంత్రాలపై వాటి తయారీ, ఉత్పత్తి స్థానాల నుంచి ప్రపంచ దేశాలకు సరఫరా అనేవి వేర్వేరు విభాగాలుగా, వేర్వేరు దేశాల్లో స్థిరపడ్డాయి. ఈ విభాగాలన్నింటినీ అదుపు చేయగలవారే భవిష్యత్తును శాసించగలుగుతారు. అమెరికా, చైనాల మధ్య ప్రారంభమైన చిప్‌ యుద్ధం ఈ అదుపు కోసమే.

No comments:

Post a Comment