Tuesday, July 18, 2023

షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశం


ప్రధాని మోదీ అధ్యక్షతన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశం 2023 జులై 3న జరిగింది. వర్చువల్‌గా జరిగిన ఈ భేటీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌, పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌లతో పాటు ఇతర సభ్యదేశాల నాయకులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. పాక్‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ‘‘కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని తమ విదేశాంగ విధానంలో భాగంగా మార్చుకుంటున్నాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, ఉగ్ర కార్యకలాపాలకు నిధులను సమకూర్చడం వంటి వాటిని నిరోధించేందుకు నిర్ణయాత్మక చర్యలు అవసరం. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాలను విమర్శించడంలో ఈ కూటమి  ఎన్నడూ వెనుకాడకూడదు. ప్రాంతీయ, ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెను ముప్పుగా మారింది. దానిపై మనమంతా కలిసికట్టుగా పోరాడాలి’’ అని ప్రధాని పిలుపునిచ్చారు.

2001లో రష్యా, చైనా, కిర్గిస్థాన్‌, కజకిస్థాన్‌, తజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ దేశాల అధ్యక్షులు షాంఘై 

No comments:

Post a Comment