Sunday, July 16, 2023

చైనాలో ఉపాధ్యాయురాలికి మరణదండన

- చైనాలో 25 మంది పిల్లలకు విషమిచ్చి, ఒకరి మరణానికి కారణమైన ఓ కిండర్‌గార్టెన్‌ టీచర్‌కు మరణశిక్షను అమలు చేశారు. హెనన్‌ ప్రావిన్స్‌ జియావోజువో నగరంలోని నం.1 ఇంటర్మీడియట్‌ కోర్టు 2023 జులై 14న ఈ విషయాన్ని వెల్లడిరచింది. ఉపాధ్యాయురాలు వాంగ్‌ యున్‌ (40)కు మరణదండనను జులై 13న అమలు చేసినట్లు ఓ నోటీసులో తెలిపింది. - ఇందులోని వివరాల ప్రకారం.. 2019 మార్చి 27న మెంగ్‌మెంగ్‌ ప్రీ-స్కూల్‌లో ‘విద్యార్థి యాజమాన్యం’ విషయమై ‘సన్‌’ అనే ఇంటిపేరున్న ఓ సహోద్యోగితో వాంగ్‌ వాగ్వాదానికి దిగింది. ఈ నేపథ్యంలో ఆమె జావలో విష పదార్థాన్ని కలిపి పిల్లలకు ఇచ్చింది. ఇతర విద్యార్థులంతా కోలుకున్నప్పటికీ ఒకరు మాత్రం 10 నెలల చికిత్స అనంతరం మృతిచెందగా.. వాంగ్‌ను కోర్టు దోషిగా నిర్ధరించింది.

No comments:

Post a Comment