Tuesday, July 18, 2023

అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల ముగింపు


  • క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకల కార్యక్రమం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో 2023 జులై 4న జరిగింది. 
  • రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ- తన ప్రాణాల్ని 26 ఏళ్ల వయసులోనే బలి ఇచ్చిన అల్లూరిది దేశ స్వాతంత్య్రోద్యమంలో ఒక ప్రముఖ అధ్యాయమని అభివర్ణించారు.
  • భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు స్మృతివనాన్ని రాష్ట్రపతి వర్చువల్‌గా ప్రారంభించారు. కేంద్ర సాంస్కృతికశాఖ రూపొందించిన 3డీ యానిమేషన్‌ చిత్రాన్ని ఆవిష్కరించారు.
  • జయంతి వేడుకలను ఏడాది కిందట భీమవరంలో ప్రధాని మోదీ ప్రారంభించగా.. హైదరాబాద్‌లో ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి ముర్ము వచ్చారు

No comments:

Post a Comment