Tuesday, July 18, 2023

స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్‌కు ఆధార్‌


  • స్వాతంత్య్ర సమరయోధులు, అర్హులైన వారి కుటుంబ పింఛన్ల జారీకి ఆధార్‌ ధ్రువీకరణ విధానాన్ని తీసుకొస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సైనిక్‌ సమ్మాన్‌ యోజన కింద ప్రయోజనాలు పొందాలనుకొనే వ్యక్తులు ఆధార్‌ కార్డు ఉన్నట్లు రుజువు సమర్పించాలని పేర్కొంది. 
  • ఆధార్‌ లేని వారికి ఇతర గుర్తింపు కార్డులు సమర్పించవచ్చని తెలిపింది. ఈ గుర్తింపుకార్డులను కేంద్ర ప్రభుత్వ అధికారులు తనిఖీ చేయాలని పేర్కొంది. వేలిముద్రలు సరిగా లేని కారణంగా ఆధార్‌ ధ్రువీకరణ విఫలమైతే ఐరిస్‌ స్కాన్‌, ముఖ గుర్తింపు విధానాల ద్వారా ధ్రువీకరించుకోవాలని హోంశాఖ సూచించింది. ఈ మూడు విధానాలూ విఫలమైతే వన్‌టైం పాస్‌వర్డ్‌ ద్వారా లబ్ధిదారుని ధ్రువీకరించాలని స్పష్టంచేసింది.

No comments:

Post a Comment