Tuesday, July 18, 2023

టాంజానియాలో తొలి ఐఐటీ క్యాంపస్‌

  • భారతదేశానికి బయట తొలి ఐఐటీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ) క్యాంపస్‌ను టాంజానియాలోని జాంజబాలో ఏర్పాటు చేస్తున్నామని, అక్టోబరు నుంచి ఇది విద్యా కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంఈఏ) 2023 జులై 6న తెలిపింది. ఈ మేరకు ఐఐటీ - మద్రాస్‌తో కుదుర్చుకున్న ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 
  • టాంజానియా పర్యటనలో భాగంగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ ఈ పరిణామాన్ని చారిత్రక అడుగుగా అభివర్ణించారు. ఈ క్యాంపస్‌ను పెరుగుతున్న ప్రపంచ అవసరాలకు దీటుగా ఉన్నతవిద్యను అందించే ప్రపంచస్థాయి వేదికగా, పరిశోధన సంస్థగా ఎంఈఏ పేర్కొంది. 
  • టాంజానియా పర్యటనలో భాగంగా ఐఎన్‌ఎస్‌ త్రిశూల్‌ ఓడపై జరిగిన రిసెప్షను వేడుకకు జాంజబా అధ్యక్షుడు డాక్టర్‌ హుసేన్‌ అలి ఎంవిన్యీతో కలిసి మంత్రి జైశంకర్‌ హాజరయ్యారు. భారతదేశం చేపట్టిన ఆరు ప్రాజెక్టుల్లో ఒకటైన కిడుతాని మంచినీటి వనరును సైతం ఆయన సందర్శించారు.

No comments:

Post a Comment