Tuesday, July 18, 2023

తమిళనాడు ఎంపీ రవీంద్రనాథ్‌ ఎన్నిక చెల్లదు



తమిళనాడులోని తేని నియోజకవర్గ ఎంపీగా ఓపీ రవీంద్రనాథ్‌ ఎన్నిక చెల్లదని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. రవీంద్రనాథ్‌ 2019 ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసి 76,319 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 

ఆస్తి విషయాలు దాచి, ఓటర్లకు నగదు, బహుమతులు ఇచ్చి ఆయన గెలుపొందారని, ఆ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని మిలాని అనే స్థానిక ఓటరు హైకోర్టులో ఎన్నికల కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారించకూడదని రవీంద్రనాథ్‌ తరఫున పిటిషన్‌ వేసినా.. హైకోర్టు దాన్ని కొట్టివేసింది.  రవీంద్రనాథ్‌ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కుమారుడు.

No comments:

Post a Comment