Tuesday, July 18, 2023

సాయిహీరా గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ప్రారంభం


శ్రీసత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి ట్రస్టు నిర్మించిన సాయిహీరా గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను 2023 జులై 4న ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. సమాజానికి సత్యసాయి చేసిన సామాజిక సేవను,  ట్రస్టు చేపడుతున్న కార్యక్రమాలను మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ వివరించారు. 

అనంతరం సాయిరాం అంటూ మోదీ తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు. ప్రేమ అనే రెండక్షరాల్లో అనంతమైన శక్తి ఇమిడి ఉందని, ప్రేమించండి.. ప్రేమతో సేవ చేయండి అంటూ ప్రపంచ మానవాళికి సత్యసాయి ఇచ్చిన  సందేశం అనుసరణీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సత్యసాయి తన జీవితాన్నే మానవాళికి అంకితం చేసిన తీరు ఆదర్శనీయమన్నారు. 

No comments:

Post a Comment