Tuesday, July 18, 2023

సాహితీవేత్త మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి మృతి



ప్రముఖ సాహితీవేత్త, వైయస్‌ఆర్‌ జిల్లా కడప నగరంలో పేరొందిన పేదల వైద్యుడు మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి (88) 2023 జులై 2న మృతి చెందారు. 
వేణుగోపాల్‌రెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా అయినా కడప నగరానికి చెందిన వరలక్ష్మిని వివాహం చేసుకుని అక్కడే సర్జన్‌గా స్థిరపడ్డారు. తక్కువ ఫీజుతో వైద్యం అందిస్తూ పేరొందారు. ఆయన భార్య వరలక్ష్మి కట్టమంచి రామలింగారెడ్డి మేనకోడలు. 
ప్రముఖ సినిమా నిర్మాత మల్లెమాల సుందరరామిరెడ్డి (ఎంఎస్‌ రెడ్డి) ఆయనకు సొంత సోదరుడు. 
మల్లెమాల 1960లోనే తన పెద్ద కుమార్తె శిరీష పేరుతో కథలు రాయడం మొదలుపెట్టి ఇప్పటి వరకు దాదాపు 100 కథలు (5 సంపుటాలుగా వచ్చాయి) రాశారు. ‘ఆవలి గట్టు’ నవలా రాశారు. ఆయన జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు (1970లో) శ్రీశ్రీ, కొడవటిగంటి వంటి సాహితీ దిగ్గజాలను కడపకు రప్పించి, ఏటా గొప్ప సాహిత్య సభలు నిర్వహించారు. 2009 నుంచి ‘మల్లెమాల సాహిత్య పురస్కారం’ ఏర్పాటు చేసి సాహితీవేత్తలకు పురస్కారాలు అందిస్తున్నారు.

No comments:

Post a Comment