Sunday, August 28, 2016

భారత్‌లో రెట్టింపవుతున్న ఇంటర్నెట్‌ వినియోగదారులు


ది ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇంటర్నెట్‌ ఇన్‌ ఇండియా పేరిట నాస్‌కామ్‌, అకమాయ్‌ టెక్నాలజీస్‌ తయారు చేసిన నివేదిక ప్రకారం గ్రామీణ భారతం క్రమ క్రమంగా వెబ్‌ విహారం చేస్తున్న నేపథ్యంలో 2020 కల్లా ఇంటర్నెట్‌ వినియోగదారులు  రెట్టింపు కంటే అధికమై 73 కోట్లలకు చేరతారు. దేశంలో 2015 చివరి నాటికి ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య 35 కోట్లలకు చేరింది. చైనా తర్వాత అత్యధిక సంఖ్యలో భారత్‌లోనే ఇంటర్నెట్‌ వినియోగదారులు ఉన్నారు. అయితే భారత్‌ అత్యధిక వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గా కొనసాగుతోంది. ఇప్పటికే ఇంటర్నెట్‌ వినియోగంలో అమెరికాను భారత్‌ అధిగమించింది

No comments:

Post a Comment