Saturday, August 27, 2016

ఏపీకి రూ.1176.50 కోట్ల కేంద్ర సాయం


విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మరికొంత సాయం చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన రెవెన్యూ లోటు కింద తాజాగా రూ.1176.50 కోట్లు విడుదల చేసింది. రాయసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు రూ.50 కోట్లు చొప్పున రూ.350 కోట్లు ఇచ్చింది. రాజధాని నిర్మాణానికి రూ.450 కోట్లు కేటాయించింది. దీంతో 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.1976.50 కోట్లు ఇచ్చినట్లుయింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 46(2) ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు ఏర్పడ్డ రెవెన్యూ లోటును కేంద్రమే భర్తీ చేయాల్సి ఉంది. ఆడిట్‌ లెక్కల ప్రకారం ఆ ఏడాదికి రూ.16,079 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడగా కేంద్రం గత రెండేళ్లలో రూ.2803 కోట్లు ఇచ్చింది. తాజాగా విడుదల చేసిన రూ.1176.50 కోట్లతో ఇది రూ.3979.50 కోట్లకు చేరింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 94(3) ప్రకారం నూతన రాజధాని అమరావతిలో నిర్మించే రాజభవన్‌ హైకోర్టు, సచివాయం, అసెంబ్లీ ఉభయ సభలతో పాటు అవసరమైన మౌలిక వసతులు నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సాయం చేయాల్సి ఉంది. విభజన చట్టంలో చెప్పిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.8,379.50 కోట్లు ఇచ్చినట్లయ్యింది. 

No comments:

Post a Comment