Sunday, August 28, 2016

తెలంగాణలో ప్రధాని మోడి పర్యటన


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాని నరేంద్రమోడి 2016 ఆగస్టు 7న తొలిసారిగా రాష్ట్రంలో పర్యటించారు. తెలంగాణలో ఇంటింటికీ మంచినీరివ్వాల న్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం మిషన్‌ భగీరథను మెదక్‌ జిల్లా గజ్వేల్‌లోని కోమటిబండ వద్ద ప్రధాని ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీపీసీ థర్మల్‌ విద్యుత్తు, రామగుండం ఎరువుల  కర్మాగారం, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీకి శంకుస్థాపనతోపాటు, ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌లో నిర్మించిన సింగరేణి థర్మల్‌ విద్యుత్తు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. హైదరబాద్‌ ఎల్బీ స్టేడియంలో మోడితో మనం...మహా సమ్మేళనం పేరుతో బీజేపీ  తెలంగాణ రాష్ట్రశాఖ ఏర్పాటుచేసిన కార్యకర్త సమావేశంలో ప్రధాని మోడి పాల్గొన్నారు. 

No comments:

Post a Comment