Monday, August 29, 2016

రియోలో భారత్‌కు తొలి పతకం అందించిన సాక్షి మాలిక్‌

రియో ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతా తెరిచింది. రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ మహిళ ఫ్రీస్టైల్‌ 58 కేజీ విభాగంలో కాంస్య పతకం సాధించింది. క్వార్టర్‌ఫైనల్లో ఓడిపోయినప్పటికీ, తనపై గెలిచిన ప్రత్యర్థి ఫైనల్‌ చేరడంతో సాక్షి రెపిచేజ్‌ రౌండ్‌కు అర్హత సాధించింది. రెపిచేజ్‌ రౌండ్‌లో సాక్షి మాలిక్‌ పురెవ్‌డోర్జిన్‌ ఓర్కాన్‌(మంగోలియా)పై గెలిచింది. పతకం కోసం జరిగిన పోరులో టినిబెకోవా ఐసు (కిర్గిజ్‌స్థాన్‌)ను ఓడించి కాంస్య పతకం సాధించింది. దీంతో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో భారత్‌ తరఫున పతకం సాధించిన తొలి మహిళగా సాక్షి రికార్డు నమోదు చేసింది.

No comments:

Post a Comment