Sunday, August 28, 2016

మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ప్రథమ స్థానంలో ఉన్న నగరం?


మధుమేహ వ్యాధి తీవ్రతకు సంబంధించి అసోచామ్‌ దేశంలోని డిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌ తదితర నగరాల్లో నిర్వహించిన అధ్యయనం వివరాలను వెల్లడించింది. డిల్లీలో 42.5% మంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. ముంబయి (38.5%), అహ్మదాబాద్‌ (36%) నగరాలు తర్వాతి స్థానాల్లో ఉండగా హైదరాబాద్‌ జనాభాలో 22.6% మంది మధుమేహంతో బాధపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మధుమేహం సంఖ్య పెరుగుతోందని అసోచామ్‌ సర్వేలో వెల్లడైంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పు రాకపోతే 2035 కల్లా 12.5 కోట్ల మంది భారతీయులు మధుమేహం బారినపడే ముప్పుందని వెల్లడించింది.

No comments:

Post a Comment