Wednesday, August 24, 2016

గుజరాత్‌లో ఈబీసీ 10% రిజర్వేషన్‌ ఆర్డినెన్స్‌ కొట్టివేత


గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10% కోటా కల్పిస్తూ జారీచేసిన అత్యవసర ఆదేశాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. పటేల్‌ వర్గ ఉద్యమాన్ని చల్లబరిచేందుకు వార్షికాదాయం రూ.6 లక్షలకు మించని, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ)కు రిజర్వేషనేతర కేటగిరీలో ప్రభుత్వోద్యోగాలు, విద్యాసంస్థల్లో 10% కోటా కేటాయిస్తూ 2016 మే 1న ప్రభుత్వం ఈ ఆర్డినెన్సును జారీ చేసింది. సుప్రీంకోర్టు విధించిన 50 శాతం రిజర్వు కోటా పరిమితికి ఇది ఉల్లంఘనేనని పేర్కొన్న హైకోర్టు ఆర్డినెన్సును కొట్టివేసింది.

No comments:

Post a Comment