Saturday, August 27, 2016

ఇస్లామాబాద్‌లో సార్క్‌ కూటమి హోం మంత్రుల సమావేశం


7వ సార్క్‌ కూటమి హోం మంత్రుల సమావేశాన్ని 2016 ఆగస్టు 4న ఇస్లామాబాద్‌లో నిర్వహించారు. భారత హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ సమావేశంలో ప్రసంగించారు. ఉగ్రవాదును ప్రోత్సహించడం, వారిని కీర్తించడం మానుకోవాలని పాక్‌కు సింగ్‌ సూచించారు. రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ సమావేశంలో హిందీలో ప్రసంగించారు. పాక్‌ హోమంత్రి చౌధురి నిసార్‌ అలీఖాన్‌ తన ప్రసంగంలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. ‘కశ్మీర్‌లో అమాయక ప్రజలపై జరుగుతున్న హింస బహిరంగ ఉగ్రవాదమే’ అని ఆయన వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment