Monday, August 29, 2016

మిస్టర్ వరల్డ్ కిరీటాన్ని సాధించిన తొలి భారతీయుడు ఎవరు?


మిస్టర్‌ వరల్డ్‌-2016 కిరీటాన్ని భారత్‌కు చెందిన రోహిత్‌ ఖండేల్వాల్‌గెల్చుకున్నాడు. ఈ కిరీటం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. రోహిత్‌ స్వస్థలం హైదరాబాద్‌. రోహిత్‌ మిస్టర్‌ వరల్డ్‌ మల్టీమీడియా అవార్డును చేజిక్కించుకున్నాడు. బ్రిటన్‌లోని సౌత్‌ పోర్ట్‌ థియేటర్‌లో తుది పోటీ జరిగింది.     విజేతగా నిలిచిన రోహిత్‌ 50,000 డాలర్లు (రూ.33.62 లక్షలు) ప్రైజ్‌మనీ గెల్చుకున్నాడు. ప్యూర్టోరికోలకు చెందిన ఫెర్నాండో అల్వారేజ్‌(21), మెక్సికోవాసి ఆల్డో ఎస్పార్జా(26) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నారు. రోహిత్‌ మిస్టర్‌ ఇండియా-2015 పోటీల్లో విజేతగా నిలిచి మిస్టర్‌ వరల్డ్‌-2016 పోటీలకు వెళ్లి అక్కడా సత్తా చాటాడు. 1996లో మొదలైన మిస్టర్‌ వరల్డ్‌ పోటీలను ప్రతి 2 సం॥కు ఒకసారి నిర్వహిస్తున్నారు.


1         రోహిత్‌ ఖండేల్వాల్‌              భారత్‌
2         ఫెర్నాండో అల్వారేజ్‌           ప్యూర్టోరికో
3         ఆల్డో ఎస్పార్జా                       మెక్సికో

No comments:

Post a Comment