Monday, August 29, 2016

ఉగ్రవాదులపై నిఘాకు జెఫైర్‌-ఎస్‌


ఉగ్రవాదులపై నిఘా పెట్టేందుకు పరిశోధకులు సూడో శాటిలైట్‌గా వ్యవహరించే ప్రత్యేక మానవ రహిత డ్రోన్‌ విమానం జెఫైర్‌-ఎస్‌ను రూపొందించారు. ఇది 45 రోజులపాటు గగనతలంలోనే ఉండి 70 వేల అడుగుల ఎత్తు నుంచి నిఘా పెట్టగలదు. ఈ డ్రోన్‌ పగటి వేళ సౌరశక్తి ద్వారా తనలోని లిథియం సల్ఫర్‌ బ్యాటరీలను రీఛార్జి చేసుకుని, రాత్రి వేళల్లో విద్యుత్‌ను వాడుకుంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని అధిగమించేందుకు సాధారణ విమానాల కంటే రెండు రెట్లపైన ఎగురుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులపై నిఘా పెట్టేందుకు బ్రిటన్‌ సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు దీన్ని ఉపయోగించుకుంటున్నాయి. 

No comments:

Post a Comment