Thursday, August 18, 2016

రచయిత్రి మహాశ్వేతాదేవి మృతి


ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త మహాశ్వేతాదేవి (91) కోల్‌కతాలో  2016 జులై 28న మరణించారు. అణగారిన వర్గాల  జీవితాల పై ఒక విద్యావేత్తగా పరిశోధించేందుకు మహాశ్వేతాదేవి గ్రామీణ భారత్‌లో ఎక్కువ కాలం  గడిపారు. ఆ పరిశోధన ఆధారంగా వారి జీవితాల గురించి హృదయాలను కదిలించేలా కథలు  రాయడానికి తన సృజనాత్మక శక్తిని ఉపయోగించారు. హజార్‌ చురాశిర్‌ మా (1084వ నంబరు వ్యక్తి తల్లి), అరణ్యేర్‌ అధికార్‌ (అటవీ హక్కు),  అగ్ని గర్భ, రుడాలి, సిధు కన్హూర్‌ డాకే, బిష్‌ - ఎకుష్‌ లాంటి ఎన్నో రచలను ఆమె చేశారు.  సామాజిక కార్యకర్తగా ఆమె చేసిన రచనలకుగాను పద్మవిభూషణ్‌, రామన్‌ మెగసెసె, జ్ఞాన్‌పీఠ్‌ అవార్డులను పొందారు. 

No comments:

Post a Comment