Tuesday, August 16, 2016

ఐక్యరాజ్య సమితిలో ఏ.ఆర్.రెహమాన్ కాక పాట కచేరీ నిర్వహించిన మరో వ్యక్తి ఎవరు..?


ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌. రెహమాన్‌ 2016 ఆగస్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి వేదికపై పాట కచేరీ నిర్వహించారు. ఇప్పటివరకు అనాటి ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు  ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మికి  మాత్రమే ఈ గౌరవం దక్కింది. ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి 1966లో ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఓ కార్యక్రమంలో తన గాన మాధుర్యాన్ని వినిపించారు. సమితిలో కచేరీ చేసిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారు. ఇప్పుడు రెహమాన్‌కు ఆ అవకాశం దక్కింది.


No comments:

Post a Comment