Tuesday, August 16, 2016

సంజీవనీ ఔషధం ఆనవాళ్లు కనుక్కోవడానికి కమిటీని ఏర్పాటు చేసిన రాష్త్రం ఏది...?

రామాయణంలో పేర్కొన్న సంజీవనీ ఔషధం ఆనవాళ్లు  కనుక్కోవడానికి ఆయుర్వేద నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. లంకలో రావణ సైన్యంతో యుద్ధం చేస్తున్న సమయంలో లక్ష్మణుడు తీవ్రంగా గాయపడగా సుసేనుడి సూచన మేరకు చికిత్స చేయడానికి  సంజీవనీ ఔషధాన్ని తీసుకురావాల్సిందిగా హనుమంతుడిని రాముడు ఆదేశించినట్లు రామాయణంలో ఉంది. ద్రోణగిరి పర్వతంపై ఉన్న ఆ ఔషధం జాడ తెలియక ఏకంగా పర్వతాన్నే హనుమంతుడు పెకిలించుకొచ్చినట్లు ఆ ఇతిహాసంలో ఉంది. ప్రస్తుతం ద్రోణగిరి పేరుతో పిలిచే పర్వతశ్రేణి ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌కు 400 కి.మీ. దూరంలో ఉంది.


No comments:

Post a Comment