Monday, August 22, 2016

వనం`మనం కార్యక్రమం



నూజివీడు మండలం సుంకొలు గ్రామంలో మిషన్‌ హరితాంధ్రప్రదేశ్‌లో భాగంగా నిర్వహించిన వనం-మనం కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఒక్క రోజులో కోటి మొక్కలు పైగా నాటి చరిత్ర సృష్టించామని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 26శాతం పచ్చదనాన్ని 2050 నాటికి 50 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సీఎం పిలుపునిచ్చారు. వనం-మనం కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా విశేషమైన స్పందన లభించిందనీ, ఒక్క రోజే 1.52 కోట్ల మొక్కలు నాటారనీ అటవీ శాఖ వెల్లడించింది.

No comments:

Post a Comment