Monday, August 22, 2016

2016 ఆగస్టు 8న క్విట్‌ ఇండియా ఉద్యమ ఎన్నవ వార్షికోత్సవం ?


క్విట్‌ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా 2016 ఆగస్టు 8న మధ్యప్రదేశ్‌లోని భాభ్రా వద్ద తిరంగా యాత్రను ప్రధాని నరేంద్రమోడి ప్రారంభించారు. క్విట్‌ ఇండియా ఉద్యమం 74వ వార్షికోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ జన్మస్థలం  మధ్యప్రదేశ్‌ అలీరాజ్‌పూర్‌ జిల్లాలోని భాభ్రా గ్రామాన్ని నరేంద్రమోడి సందర్శించి ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.మహారాష్ట్ర ప్రభుత్వం రెండో దశ క్విట్‌ ఇండియా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. పలు సామాజిక సమస్యలపై పోరాటానికి, సుపరిపాలన లక్ష్యంతో క్విట్‌ ఇండియా ఉద్యమ ప్లాటినం జూబ్లీ వేడుకల  సంస్మరణగా ఈ నిర్ణయం తీసుకుంది.  1942 ఆగస్టు 8న క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది.



No comments:

Post a Comment