Tuesday, August 16, 2016

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఖేలో ఇండియా క్రీడా పోటీలు


రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో యువత కోసం జరిగే దేశవ్యాప్త క్రీడా పోటీలను ప్రధాని నరేంద్రమోడి డిజిటల్‌ విధానంలో 2016 జులై 23న  డిల్లీలో ప్రారంభించారు. ఇవి పాఠశాలలు, కళాశాలల  స్థాయిలో వేర్వేరు నగరాల్లో జరిగే అతిపెద్ద జాతీయ పోటీలు . ఖేలో ఇండియా పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి అనుగుణంగా రిలయన్స్‌ ఫౌండేషన్‌ చేపట్టిన పోటీ కార్యక్రమంలో భాగంగా తొలి ఏడాది 8 నగరాల్లో ఫుట్‌బాల్‌ పోటీలు  నిర్వహిస్తారు. వివిధ క్రీడల్లో ప్రతిభావంతుల్ని గుర్తించి, వారికి స్కాలర్ షిప్ లు  అందిస్తుంది. దీని నిమిత్తం రిల యన్స్‌ ఫౌండేషన్‌ ఆరుగురు సభ్యుతో సలహా మండలి ఏర్పాటు చేసింది. దీనిలో రిలయన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీతో పాటు సచిన్‌ టెందుల్కర్ , లియాండర్‌పేస్‌, సైనా నెహ్వాల్‌ తదితరులున్నారు.

No comments:

Post a Comment