Friday, September 30, 2016

గ్రామీణ పారిశుధ్యంలో సిక్కింకు ప్రథమ స్థానం


గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులపై నిర్వహించిన జాతీయ శాంపిల్‌ సర్వేలో స్వచ్ఛ రాష్ట్రంగా సిక్కిం మొదటి స్థానాన్ని దక్కించుకుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ న్యూఢల్లీలో 2016 సెప్టెంబర్‌ 8న ఎన్‌ఎస్‌ఎస్‌వో సర్వే నివేదికను విడుదల చేశారు. ఇందులో 98.2 శాతంతో సిక్కిం మొదటి స్థానాన్ని దక్కించుకోగా, జార్ఖండ్‌ చివరి స్థానంలో నిలిచింది. గుజరాత్‌ 14వ స్థానంలో, ఏపీ 16వ స్థానంలో తెలంగాణ 22వ స్థానంలో నిలిచాయి. 2015 మే-జూన్‌ మధ్య 26 రాష్ట్రాల్లోని 3,788 గ్రామాలు, 73,716 నివాసాల్లో సర్వే నిర్వహించారు. మరుగుదొడ్లను కలిగి ఉన్న ఇండ్ల శాతం, వాటి వినియోగం ఆధారంగా ఈ ర్యాంకును ఖరారు చేశారు

No comments:

Post a Comment