Tuesday, September 20, 2016

యోగేశ్వర్‌ దత్‌కు పతక ప్రమోషన్‌


2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రెజ్లర్‌ యోగేశ్వర్‌దత్‌ సాధించిన కాంస్యంను 4 సం॥ తర్వాత రజతంగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ఒలింపిక్స్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ గేమ్స్‌లో రజతం సాధించిన రష్యా రెజ్లర్‌ కుదుఖోవ్‌ అంతర్జాతీయ డోపింగ్‌ వ్యతిరేక సంస్థ (వాడా) నిర్వహించిన డోపింగ్‌ పరీక్షలో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు రుజవు కావడంతో యోగేశ్వర్‌కు రజతం దక్కింది. పురుషుల 60 కేజీల ఫ్రీస్టయిల్‌ విభాగం ప్రి కార్టర్‌ ఫైనల్లో బెసిక్‌ కుదుఖోవ్‌ చేతిలో యోగేశ్వర్‌ ఓడిపోయాడు అయితే కుదుఖోవ్‌ ఫైనల్‌కు చేరడంతో వచ్చిన రేప్‌చేజ్‌ అవకాశంతో యోగేశ్వర్‌ కాంస్య పతకం సాధించాడు. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌, బీజింగ్‌ గేమ్స్‌లో కాంస్యం సాధించిన కుదుఖోవ్‌ 2013లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

No comments:

Post a Comment