Wednesday, September 21, 2016

భారత్‌, థాయిలాండ్‌ మధ్య ఒప్పందాలు


రక్షణ తీరప్రాంత భద్రతతోపాటు ఆర్థిక, సైబర్‌ సెక్యూరిటీ, మనుషుల అక్రమ రవాణా, ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల్లో పరస్పర సహకారం అందించుకునేందుకు భారత్‌-థాయిలాండ్‌ నిర్ణయించాయి. 2016 జూన్‌ 17న భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడి, థాయిలాండ్‌ ప్రధాన మంత్రి ప్రయత్‌ చానోచా మధ్య ఢల్లీలో జరిగిన సమావేశంలో ఈ అంశాలపై చర్చించారు. భారత్‌-మయన్మార్‌`థాయిలాండ్‌ త్రైపాక్షిక రహదారిని పూర్తి చేయటంతోపాటు ఈ మూడు దేశాల మధ్య మోటారు వాహన ఒప్పందం జరగటాన్ని భారత-థాయిలాండ్‌ దేశాలు ప్రాధాన్యతాంశంగా గుర్తించాయి. ఇరుదేశాల మధ్య సంబంధాలకు ద్వైపాక్షిక సంబంధాలకు త్వరలోనే 70 వసంతాలు పూర్తవనున్నందున భారత్‌లో థాయ్‌ ఉత్సవం, థాయిలాండ్‌లో భారత్‌ ఉత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో 2016-19 కాలానికి ‘సంస్కృతి మార్పిడికి ప్రత్యేక కార్యక్రమం’, నాగాలాండ్‌ వర్సిటీ, థాయిలాడ్‌లోని చియాంగ్‌ మాయ్‌ వర్సిటీ మధ్య ఒప్పందాలు కుదిరాయి. అలాగే భారత్‌లోని బౌద్ధ స్థలాలను చూసేందుకు వచ్చే థాయిలాండ్‌ పర్యాటకులకు డబుల్‌ ఎంట్రీ ఈ-టూరిస్టు వీసాలను ఇచ్చేలా కొత్త నిబంధనలను మోడి ప్రకటించారు.

No comments:

Post a Comment