Friday, September 30, 2016

నెల్లూరు బాలికకు యోగాలో 3 స్వర్ణాలు

వియత్నాం రాజధాని హునాయ్‌లో జరిగిన 6వ ఏషియన్‌ యోగా చాంపియన్‌షిప్‌-2016 పోటీల్లో నెల్లూరుకు చెందిన ఏకాంబరం జ్యోష్ణవి 3 బంగారు పతకాలు సాధించింది. అండర్‌-17 విభాగంలో పోటీ పడి వ్యక్తిగత యోగాసన, ఆర్టిస్టిక్‌ రిథమిక్‌ యోగా పోటీల్లో విజేతగా నిలిచి 3 బంగారు పతకాలు, వ్యక్తిగత సోలో ఆర్టిస్టిక్‌ పోటీల్లో రజత పతకాన్ని సాధించింది. దీంతో డిసెంబర్‌లో దక్షిణ అమెరికాలో జరిగే వరల్డ్‌ యోగా చాంపియన్‌షిప్‌ పోటీకు జ్యోష్ణవి అర్హత సాధించింది.

No comments:

Post a Comment