Thursday, September 22, 2016

భారత్‌`నేపాల్‌ మధ్య 9 ఒప్పందాలు

భారత్‌-నేపాల్‌ మధ్య రవాణా, విద్యుత్‌ సహా వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి 9 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. భారత పర్యటనలో ఉన్న నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీతో ప్రధాని నరేంద్రమోడి 2016 ఫిబ్రవరి 20న ఢల్లీలో సమావేశమయ్యారు. భారత్‌ నుంచి నేపాల్‌కు 80 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసే 400 కేవీ ధాల్కేబార్‌-ముజఫర్‌పూర్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ను ఇద్దరూ జాతికి అంకితం చేశారు. ప్రధానితో భేటీకి ముందు ఓలీతో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ చర్చలు జరిపారు. భూకంపం తాకిడికి దెబ్బతిన్న నేపాల్‌కు గతంలో ప్రకటించిన 100 కోట్ల డాలర్లలో భాగంగా 25 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం విడుదల, భారత్‌తో సరిహద్దుగల తెరాయ్‌ ప్రాంతంలో 518 కి.మీ. మేర రోడ్ల అభివృద్ధి, నేపాల్‌ బంగ్లాదేశ్‌ మధ్య విశాఖపట్నం పోర్టు ద్వారా వర్తకం, విశాఖపట్నం నుంచి రైలు రవాణా మార్గం మొదలైన అంశాలపై అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

No comments:

Post a Comment