Saturday, September 17, 2016

ప్రతి 10 మందిలో 9 మంది కలుషిత గాలి బాధితులు


వాయు కాలుష్య మరణాల కారణంగా ప్రపంచం విలువైన మానవ వనరులను కోల్పోతున్నట్లు ప్రపంచ బ్యాంకు, ఆరోగ్య ప్రమాణాల, మూల్యాంకన సంస్థ(IHME) సంయుక్త అధ్యయనంలో తేలింది. అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లో ప్రతి 10 మందిలో 9 మంది కలుషిత గాలే పీల్చుతున్నారు. ప్రపంచ ఖజానాలో 1 శాతానికి (సుమారు రూ.48 క్ష కోట్లు) సమానమైన ఆదాయ నష్టం వాయు కాలుష్యం ద్వారా కలుగుతోంది. 2013 గణాంకాల ప్రకారం వాయు కాలుష్య మరణాల కారణంగా ఆదాయ నష్టం, వైద్య ఖర్చు, వ్యవసాయ ఉత్పాదకత తగ్గుదల అన్నీ కలిపి అప్పటి సగటు విలువ ప్రకారం సుమారు రూ.300 లక్షల కోట్లు (5 లక్షల కోట్ల డాలర్లు) మేర ప్రపంచం నష్టపోయినట్లు అంచనా.
IHME-Institute for Health Metrics and Evaluation 

No comments:

Post a Comment