Monday, September 12, 2016

అంతర్జాతీయ బానిసత్వ సూచీ-2016


ఆస్ట్రేలియాకు చెందిన వాక్‌ ఫ్రీ ఫౌండేషన్‌ అంతర్జాతీయ బానిసత్వ సూచీ-2016 పేరిట ఓ నివేదికను వెలువరించింది. వెట్టిచాకిరీలో మగ్గుతున్నవారు ప్రపంచవ్యాప్తంగా 4.58 కోట్ల మంది ఉండగా అందులో 40 శాతం భారత్‌లోనే ఉన్నారని వెల్లడించింది. మొత్తం 167 దేశాల్లో బానిసత్వం ఉన్నట్లు గుర్తించారు. ఉత్తర కొరియాలో అత్యధికంగా 4.37 శాతం ఉన్నారు. ఆసియా దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ప్రపంచంలోని మొత్తం వెట్టిచాకిరీ పనివారు, నిర్బంధ కూలీల్లో భారత్‌, చైనా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఉజ్బెకిస్థాన్‌ల్లోనే 58 శాతం మంది ఉన్నారు. జనాభాతో పోలిస్తే నిర్బంధ కూలీల శాతం ఎక్కువగా ఉన్న దేశాలు ఉత్తర కొరియా, ఉజ్బెకిస్థాన్‌, కంబోడియా, ఖతార్‌. 124 దేశాల్లో ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాల ప్రకారం మానవ అక్రమ రవాణా నిరోధక చట్టాలు అమలవుతున్నాయి.
2014 నుంచి 2016 మధ్య సుమారు 40 లక్షల మంది నిర్బంధ కూలీలు పెరిగారు. సగటున రోజుకి 5,616 మంది కొత్తగా వెట్టిచాకిరీ, నిర్బంధ శ్రమ దోపిడీలో చిక్కుకుంటున్నారు.
దేశంలో మొత్తం 43,53,247 మంది బాల కార్మికులు (5 నుంచి 14 ఏళ్ల లోపు) ఉన్నారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 8,96,301 మంది, తెలుగు  రాష్ట్రాల్లో 4,04,851 మంది ఉన్నారు.
        దేశం                      నిర్బంధ కూలీలు జనాభాలో శాతం
భారత్‌                 1,83,54,700 1.4
చైనా                         33,88,400 0.247
పాకిస్థాన్‌                  21,34,900 1.13
బంగ్లాదేశ్‌                  15,31,300 0.9512
ఉజ్బెకిస్థాన్‌           1,23,660 3.973
ఉత్తర కొరియా           11,00,000 4.373
రష్యా                           10,48,500 0.732
నైజీరియా                    8,75,500 0.481
కాంగో                     8,73,100 1.130
ఇండోనేషియా            7,36,100 0.286
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg










No comments:

Post a Comment