Monday, September 19, 2016

అణు నష్టపరిహార ఒప్పందానికి భారత్‌ ఆమోదం

అణు నష్టంపై అదనపు నష్టపరిహార ఒప్పందానికి  భారత్‌ 2016 ఫిబ్రవరి 4న ఆమోదం తెలిపింది. పౌర అణు బాధ్యతలకు సంబంధించి ఇది ముఖ్యమైన ముందడుగు. దీనికి సంబంధించిన పత్రాలను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ కు భారత ప్రతినిధి అందజేశారు. ఈ ఒప్పందం భారత్‌కు సంబంధించి 2016 మే 4 నుంచి అమల్లోకి వస్తుంది.

No comments:

Post a Comment