భారత్తో సైనికపరమైన సహకారాన్ని పెంచుకోవడానికి ఉద్దేశించిన తీర్మానాన్ని అమెరికా సెనెట్ ఆమోదించింది. పొంచిఉన్న ముప్పును విశ్లేషించడం, బలగాల ప్రణాళిక, సైన్య సిద్ధాంతం, మౌలిక సదుపాయాలపరమైన మద్దతు, నిఘా సమాచార సేకరణ - విశ్లేషణ ఈ అంశాల్లో సహకారాన్ని విస్తృతం చేసుకోనున్నాయి. ‘జాతీయ రక్షణ అధీకృత చట్టం (ఎన్డీఏఏ)- 2017’ను 85-13 ఓట్ల తేడాతో సెనెట్ ఆమోదించింది. సంయుక్త సైనిక కార్యకలాపాలు చేపట్టడంపై తగిన చర్యలు తీసుకునే అధికారం ఈ చట్టం ప్రకారం రక్షణ మంత్రికి ఉంటుంది. అధికారుల పరస్పర పర్యటనలపైనా మంత్రి నిర్ణయం తీసుకుంటారు. నౌకాయాన భద్రత, పైరసీ నిరోధం, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లోనూ రెండు దేశాలూ సహకరించుకుంటాయి.
No comments:
Post a Comment