Friday, September 16, 2016

వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాని డబ్యూహెచ్ ఒ పిలుపు

కాలుష్య కారకాలతో క్యాన్సర్ల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడంపై తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ ఒ) భారత్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాలను కోరింది. ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్య నగరాల్లో 14 ఈ ప్రాంతంలోనే ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సూచన చేసింది. క్యాన్సర్‌ వల్ల ఏటా 82 లక్షల మంది మరణిస్తున్నారని వీరిలో మూడింట రెండొంతుల మంది అల్ప, మధ్య ఆదాయ దేశాలకు చెందినవారేనని గుర్తుచేసింది.

No comments:

Post a Comment