Saturday, September 17, 2016

దినేష్‌ భరాదియాకు మార్కోనీ సొసైటీ పాల్‌ బారన్‌ యంగ్‌ స్కార్‌ అవార్డు


రేడియో తరంగాలపై చేపట్టిన పరశోధనకుగాను అమెరికాలోని భారత సంతతి పరిశోధకుడు దినేష్‌ భరాదియా (29)కు మార్కోనీ సొసైటీ పాల్‌ బారన్‌ యంగ్‌ స్కార్‌ అవార్డు లభించింది. సుమారు 150 సం॥లుగా వెంటాడిన చిక్కు ప్రశ్నకు ఆయన పరిశోధనలో సమాధానం లభించింది. ‘రేడియోలు ఏ పౌనఃపున్యంలో అయితే తరంగాలను తీసుకుంటాయో అదే పౌనఃపున్యంతో వాటిని ప్రసారం చేయలేవు. మధ్యలో ఎదురయ్యే అవరోధాలు దీనికి కారణం’ అనే భావనకు ఆయన తప్పని నిరూపించారు. దీంతో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ సాంకేతికతను మరిన్ని మార్గాల్లో ఉపయోగించుకునేందుకు మార్గం సుగమమైంది. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకున్న దినేష్‌ మస్సాచుసెట్స్‌ సాంకేతిక వర్సిటీలో శాస్త్రవేత్తగా కొనసాగుతున్నారు.

No comments:

Post a Comment