రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్కు చైనాలో అరుదైన గౌరవం లభించింది. ఠాగూర్ రచనలను తొలిసారిగా చైనా భాషలోకి అనువదించారు. కవిత్వం, వ్యాసం, నవలలు, నాటకాలతో కూడిన 1.60 కోట్ల పదాలను 33 సంపుటాల్లో తర్జుమా చేశారు. ఠాగూర్ 155వ జయంతి నేపథ్యంలో చైనా 2016 మేనెలలో వీటిని విడుదల చేసింది. ఠాగూర్కు ఉన్న ప్రజాదరణ నేపథ్యంలో ఇప్పటివరకు ఆంగ్లం నుంచి చైనా భాషలోకి అనువాదం జరిగాయి. కానీ తొలిసారిగా బెంగాలీ నుంచి చైనా భాషలోకి అనువాదం చేశారు.
No comments:
Post a Comment