Monday, September 19, 2016

అనిత అశోక్‌ డాటార్‌ సేవలను స్మరించుకున్న సెనెట్‌

మాలిలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన భారతీయ-అమెరికన్‌ అనిత అశోక్‌ డాటార్‌ సేవలను అమెరికా ఎగువ సభ (సెనెట్‌) స్మరించుకుంది. ప్రజారోగ్యం, అంతర్జాతీయ అభివృద్ధికి ఆమె అందించిన సేవలను ప్రశంసిస్తూ దాఖలు చేసిన తీర్మానాన్ని ఎగువసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతర్జాతీయ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా మాలిలో పనిచేస్తున్న అనిత 2015 నవంబరులో అక్కడి హోటల్‌లో జరిగిన దాడిలో మరణించారు.

No comments:

Post a Comment