మానవ చర్యల కారణంగా ఉత్పన్నమవుతున్న గ్రీన్హౌస్ ఉద్గారాలను పర్యవేక్షించడానికి 60కి పైగా దేశాల అంతరిక్ష సంస్థలు తొలిసారిగా చేతులు కలిపాయి. అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఫ్రాన్స్ ఖగోళ సంస్థ సీఎన్ఈఎస్ చొరవ వల్ల ఇది సాధ్యమైంది. ఈ సంస్థలు ఉద్గార పర్యవేక్షణకు తమ ఉపగ్రహాలను ఉపయోగిస్తాయి. పరస్పరం సహకారం, సమన్వయంతో ముందుకు సాగుతాయి. ఇస్రో, సీఎన్ఈఎస్ ఆహ్వానం మేరకు 2016 ఏప్రిల్లో ఢల్లీ వచ్చిన ప్రపంచ అంతరిక్ష సంస్థలు తమ భూపరిశీన ఉపగ్రహా ల డేటాను కేంద్రీకృతం చేయడానికి ఒక స్వతంత్ర అంతర్జాతీయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తూ చేసిన ‘న్యూఢల్లీ డిక్లరేషన్’ తాజాగా అమల్లోకి వచ్చింది.
No comments:
Post a Comment