Thursday, October 6, 2016

స్వచ్ఛ విద్యాలయాలు రాష్ట్రస్థాయి పురస్కార్‌-2016 40 స్కూళ్లు


స్వఛ్ఛ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ విద్యాలయాలు రాష్ట్రస్థాయి పురస్కార్‌-2016కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 40 ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేసింది. వాటిని జాతీయ స్థాయి అవార్డు పోటీలో నిలిపింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100 పాఠశాలను ఎంపిక చేస్తుంది. అందులో 30 పట్టణ, 70 గ్రామీణ ప్రాంతాలకు చెందినవి. ఎంపికైన వాటికి నిర్వహణ గ్రాంటు కింద రూ.50 వేలు, ప్రశంసా పత్రం బహుకరిస్తారు. 

No comments:

Post a Comment