Thursday, October 6, 2016

నేతాజీ మృతిపై విచారణను లార్డ్‌ ఆర్చిబాల్డ్‌ వావెల్‌ ప్రారంభించినట్లు వెల్లడి


నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మృతిపై విచారణను అప్పటి భారత వైశ్రాయ్‌ లార్డ్‌ ఆర్చిబాల్డ్‌ వావెల్‌ ప్రారంభించినట్లు వెలుగులోకి వచ్చింది. నేతాజీ మరణానికి దారితీసిన పరిస్థితులపై ఏర్పాటైన బ్రిటన్‌ వెబ్‌సైట్‌ బోస్‌ ఫైల్‌ డాట్‌ ఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించారు . తైపీలో నేతాజీ మరణించారని వార్తలు వినిపించిన తొమ్మిది రోజుల తర్వాత (1945 ఆగస్టు 27) విచారణకు ఆదేశించామని మంత్రి మండలికి అప్పటి భారత వైశ్రాయ్‌ లార్డ్‌ ఆర్చిబాల్డ్‌ వావెల్‌ తెలియజేశారు. నేతాజీ విమాన ప్రయాణంలోనే మరణించినట్లు మరోసారి స్పష్టమైంది.

No comments:

Post a Comment