Thursday, October 6, 2016

భారత్‌`పాక్‌

భారత సైన్యం నియంత్రణ రేఖ దాటి పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. భారత్‌లోకి చొచ్చుకురావడానికి సిద్ధమవుతున్న ఉగ్రవాదులను గణనీయ స్థాయిలో మట్టుపెట్టింది. ప్రత్యేక బలగాలతోపాటు బారాముల్లా, రాజౌరీ, కుప్వారా కేంద్రంగా పనిచేస్తున్న 19,25,28 సైనిక డివిజన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఈ ఆపరేషన్‌లో ఆక్రమిత కశ్మీర్‌లోని భింబేర్‌, హాట్‌స్ప్రింగ్‌, కెల్‌, లిపా సెక్టార్లలోని ఉగ్రవాద చొరబాటు శిబిరాలన్నింటినీ ధ్వంసం చేశాయి. భారత సైన్యం దాడిలో 40 మంది ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని అంచనా వేశారు.

No comments:

Post a Comment